TTD | విధాత: తిరుమల వెంకన్న దర్శనానికి నడకదారిలో వెళ్లాలనుకునే భక్తులు ఇక ముందు చీకటి పడకముందే కిందకు చేరుకోవాలి.. సాయంత్రం చల్లగాలికి అలా నడుద్దాం అనుకుంటే కుదరదు. నడకమార్గంపై కీలక నిర్ణయం దిశగా…! నిన్న సాయంత్రం ఇలాగే తల్లిదండ్రులలో కొండకు నడిచి వెళ్తున్న నెల్లూరు జిల్లా కోవూరు మండలం సోతిరెడ్డిపాళేనికి చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత చిరుత దాడిలో మరణించిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతోపాటు గత నెల కూడా ఓ బాలుడిని […]
TTD |
విధాత: తిరుమల వెంకన్న దర్శనానికి నడకదారిలో వెళ్లాలనుకునే భక్తులు ఇక ముందు చీకటి పడకముందే కిందకు చేరుకోవాలి.. సాయంత్రం చల్లగాలికి అలా నడుద్దాం అనుకుంటే కుదరదు.
నిన్న సాయంత్రం ఇలాగే తల్లిదండ్రులలో కొండకు నడిచి వెళ్తున్న నెల్లూరు జిల్లా కోవూరు మండలం సోతిరెడ్డిపాళేనికి చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత చిరుత దాడిలో మరణించిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతోపాటు గత నెల కూడా ఓ బాలుడిని చిరుత ఎత్తుకెళ్లిన తరువాత అక్కడున్న భక్తులు కేకలు వేయడంతో అది వదిలేసింది. పిల్లాడికి ప్రాణ గండం తప్పింది.
ఇలా వరుస ఘటనలు జరగడంతో తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతానికి లక్షితకు రూ. పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు నడకదారి మీద నిబంధనలు తీసుకొస్తోంది.
భక్తులు ఎక్కువగా శ్రీవారి మెట్టు, అలిపిరి మార్గాల ద్వారా నడుచుకుంటూ తిరుమల వెళుతుంటారు. నడకడారి మొత్తం చిక్కటి అడవి కావడంతో చిరుతలు, ఎలుగు బంట్లు తిరుగుతుంటాయి. ఇవి మనుషుల మీద దాడి చేసేందుకు ఏమాత్రం వెనుకాడవు. దీంతో భక్తుల భద్రత నిమిత్తం సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకు మూసివేత దిశగా ఆలోచిస్తున్నట్టు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
అలాగే నడక దారిలో ప్రతి 40 అడుగులకు ఒక సెక్యూరిటీ గార్డ్ ను ఉంచుతామని, నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల సంచారాన్ని గమనిస్తామన్నారు. మొత్తానికి తిరుపతి మెట్ల మార్గంలో వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.