UP | ఓ ఇద్దరు అమ్మాయిలు స్వలింగ సంపర్కులుగా మారారు. ఈ విషయం ఓ అమ్మాయి ఇంట్లో తెలిసింది. అబ్బాయిగా మారాలనుకుంటున్న అమ్మాయిని చంపాలని మరో యువతి తల్లి ప్లాన్ చేసింది. తాంత్రికుడికి డబ్బులు ఆశజూపి.. అతనితో ఆ అమ్మాయిని హత్య చేయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్బాద్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. షాజహాన్బాద్ జిల్లాలోని ఆర్సీ మిషన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రీతి, పూనమ్ ఇద్దరు మంచి […]
UP |
ఓ ఇద్దరు అమ్మాయిలు స్వలింగ సంపర్కులుగా మారారు. ఈ విషయం ఓ అమ్మాయి ఇంట్లో తెలిసింది. అబ్బాయిగా మారాలనుకుంటున్న అమ్మాయిని చంపాలని మరో యువతి తల్లి ప్లాన్ చేసింది. తాంత్రికుడికి డబ్బులు ఆశజూపి.. అతనితో ఆ అమ్మాయిని హత్య చేయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్బాద్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. షాజహాన్బాద్ జిల్లాలోని ఆర్సీ మిషన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రీతి, పూనమ్ ఇద్దరు మంచి దోస్తులు. అయితే ఈ ఇద్దరు అమ్మాయిల మధ్య ఏర్పడిన పరిచయం స్వలింగ సంపర్కులుగా మారేలా చేసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే పూనమ్ అబ్బాయిలా మారాలని నిర్ణయించుకుంది.
ఇక ప్రీతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ప్రీతి, పూనమ్కు ఉన్న రిలేషన్షిప్ బయటపడటంతో చాలా సంబంధాలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో పూనమ్ను ఎలాగైనా వదిలించుకోవాలని ప్రీతి తల్లి ఊర్మిళ నిర్ణయించుకుంది. ఇందుకు స్థానికంగా ఉన్న ఓ తాంత్రికుడిని సంప్రదించింది.
పూనమ్ను అబ్బాయిలా మారుస్తానని నమ్మబలికి, ఆమెను చంపితే రూ. 1.5 లక్షలు ఇస్తానని ఊర్మిళ తాంత్రికుడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందానికి అంగీకరించడంతో అతనికి మొదటగా రూ. 5 వేలు ఇచ్చింది ఊర్మిళ.
ఇక ప్లాన్లో భాగంగా ప్రీతి పూనమ్కు ఫోన్ చేసి.. అబ్బాయిలా మారుస్తానని ఓ తాంత్రికుడి చెప్పినట్లు తెలిపింది. దీంతో పూనమ్ ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చింది. తమ సోదరి అదృశ్యమైందని ఏప్రిల్ 26న పూనమ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రీతి, పూనమ్ రిలేషన్షిప్పై పోలీసులు దృష్టి సారించారు. ప్రీతి, తాంత్రికుడి సంభాషణను పోలీసులు సేకరించారు. దీంతో తాంత్రికుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు.
అబ్బాయిలా మారడానికి కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉందని, నది ఒడ్డుకు వెళ్లాలని పూనమ్కు తాంత్రికుడు సూచించాడు. ఇక ఇద్దరు కలిసి నది ఒడ్డుకు చేరుకున్నారు. తాను చెప్పినట్టు చేయాలని ఆమెను ఆదేశించాడు. నది ఒడ్డుపై పడుకొని, కళ్లు మూసుకోవాలని సూచించాడు.
తాంత్రికుడు చెప్పినట్లు పూనమ్ చేసింది. కళ్లు మూసుకుని ఉన్న పూనమ్ మెడపై వేట కొడవలితో దాడి చేసి చంపాడు. అనంతరం డెడ్ బాడీని అక్కడే ఉన్న చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. ఈ కేసులో ప్రీతి, తాంత్రికుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఊర్మిళ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.