Warangal సర్వేష్ కుటుంబాన్ని ఆదుకుంటాం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానసిక వ్యాధితో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారి యశస్వికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూస్తానని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. కాజీపేట విద్యానగర్కు చెందిన యశస్వి తండ్రి తోకల సర్వేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు. సర్వేష్ దంపతులు తన కూతురు యశస్వి(5)కి వైద్య […]
Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానసిక వ్యాధితో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారి యశస్వికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూస్తానని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. కాజీపేట విద్యానగర్కు చెందిన యశస్వి తండ్రి తోకల సర్వేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు.
సర్వేష్ దంపతులు తన కూతురు యశస్వి(5)కి వైద్య సహాయం చేయించాలని కోరుతూ ప్రభుత్వ చీఫ్ విప్ ను శుక్రవారం కలుసుకున్నారు. యశస్వి మానసిక సమస్యతో బాధపడుతుందని, వయసు పెరుగుతున్నా నడవడం లేదని, ఆసుపత్రుల్లో వైద్య చికిత్సల కోసం ఇప్పటివరకు నాలుగు లక్షల రూపాయల ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయిస్తే మెరుగుపడే అ అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్పారని ఆర్థిక స్తోమత లేని కారణంగా వైద్యం అందించలేకపోతున్నామని వివరించారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. సర్వేశ్ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు విన్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ యశస్వికి తగిన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానికులు ప్రకాష్, వినయ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.