Warangal కాంగ్రెస్ పాలనలో పవర్ హాలీడేలు, క్రాఫ్ హాలిడేలు మూడు గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ను తరిమికొట్టాలి రాబోయే ఎన్నికలలో రైతన్నలే గుణపాఠం చెప్తారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖానాపూర్ మండలం రైతువేదికలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ […]
Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖానాపూర్ మండలం రైతువేదికలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండి, రైతుల కంట కన్నీరు కారిందన్నారు.
తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టలేక అన్నదాతల గుండెలు ఆగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోని కరెంట్ కష్టాలను అంత తొందరగా ఎలా మర్చిపోతామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని కెసీఆర్ ఉద్యమ జెండాను ఎత్తుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగు రంగాన్ని సంక్షోభం నుండి బయటపడేయాలని సాగు నీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఎన్నో విప్లవాత్మక పథకాలను తీసుకువచ్చారని తెలిపారు.
మూడు పంటల తెలంగాణ కావాలని బీఆర్ఎస్ సంకల్పం తీసుకుంటే, మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాన్ని ప్రకటించిందని మండిపడ్డారు. మూడు పంటల బీఆర్ఎస్ కావాలా..? మూడు గంటల కాంగ్రెస్ కావాలా..? తెలంగాణ రైతాంగం తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతును అవమానించేలా అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత కరెంట్ వద్దన్న కాంగ్రెస్ లీడర్లను ఊరిపొలిమేరల దాకా ఉరికించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దీనికి ముందు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డీసీఎంఎస్ చైర్మన్, కానాపురం మండలం ఎంపీపీ, జడ్పిటిసి, మండల పార్టీ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి బాధ్యతలు, క్లస్టర్స్ మరియు పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.