టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ తన 30 మంది క్యాబిన్ క్రూ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది.
న్యూఢిల్లీ : టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ తన 30 మంది క్యాబిన్ క్రూ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. బుధవారం వారందరూ మూకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టుకోవడంతో ఈ చర్య తీసుకున్నది. క్యాబిన్ క్రూ మూకుమ్మడి సిక్ లీవ్తో దాదాపు 90 విమానాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై టాటా గ్రూపు యాజమాన్యం స్పందిస్తూ ఉద్యోగుల చర్యతో వేల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నది. సంస్థకు చెడ్డపేరు తీసుకొచ్చిన ఈ చర్యను సహించేది లేదని స్పష్టం చేసింది. పైగా సంస్థకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నది. మూకుమ్మడి సిక్ లీవ్ ఉద్దేశపూర్వకం చేసినదేనని అర్థమవుతున్నదని తెలిపింది.