కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు పాఠశాలలకు శుక్రవారం బాంబు బెదిరింపు హెచ్చరికలు అందాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ మేరకు ఆయా స్కూళ్లకు ఇ మెయిల్స్ వచ్చాయి.
విధాత: కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు పాఠశాలలకు శుక్రవారం బాంబు బెదిరింపు హెచ్చరికలు అందాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ మేరకు ఆయా స్కూళ్లకు ఇ మెయిల్స్ వచ్చాయి. బెదిరింపు ఇ మెయిల్స్తో భయాందోళనకు గురైన స్కూళ్ల యాజమాన్యాలు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఆయా స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బందిని బయటకు పంపించారు. స్కూళ్లను ఖాళీ చేయించారు.
Certain schools in #Bengaluru city have received emails today morning indicating ‘bomb threat’. Anti sabotage and bomb detection squads have been pressed into service to verify and ascertain. The calls seem to be a hoax. efforts will be made to trace the culprits:@BlrCityPolice pic.twitter.com/SYElSaGMzx
— Express Bengaluru (@IEBengaluru) December 1, 2023
బెంగళూరులోని 13 స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్పంపారు గుర్తుతెలియని దుండగులు. బసవేశ్వర్నగర్లోని విద్యాశిల్ప, నపెల్ సహా ఏడు స్కూళ్లకు తొలుత బాంబులు ఉన్నట్టు ఇ మెయిల్స్ అందాయి. తర్వాత మరికొన్ని విద్యాసంస్థలకు కూడా ఇదే తరహాలో బెదిరింపు ఇ మెయిల్స్ పంపారు దుండగులు. పోలీసులు ఆయా స్కూళ్లను ఖాళీ చేయించి బాంబులు, అనుమానాస్పద వస్తువుల కోసం గాలిస్తున్నారు. అలాగే మెయిల్స్ పంపిన వారి ఆచూకీ తెలుసుకుంటున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.