Delhi : ఆదివారం నుంచి ఢిల్లీలో రెండు రోజులు ఆల్ ఇండియా స్పీక‌ర్ల కాన్ఫ‌రెన్స్‌

ఆదివారం, సోమవారం ఢిల్లీలో రెండు రోజుల ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్, అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా హాజరు.

Delhi : ఆదివారం నుంచి ఢిల్లీలో రెండు రోజులు ఆల్ ఇండియా స్పీక‌ర్ల కాన్ఫ‌రెన్స్‌

విధాత‌, న్యూఢిల్లీ: ఆలిండియా స్పీక‌ర్ల కాన్ఫ‌రెన్స్(All India Speakers Conference) ఢిల్లీలో రెండు రోజుల పాటు జ‌రుగ‌నున్న‌ది. ఆది,సోమ‌వారాల్లో రెండు రోజుల పాటు జ‌రిగే ఈ కాన్ఫ‌రెన్స్ ఢిల్లీలోరి(Delhi) అసెంబ్లీ భ‌వ‌నంలో నిర్వ‌హించానికి ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు జ‌రిగే కాన్ఫ‌రెన్స్‌న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్ర‌రంభించ‌నున్నారు. సోమ‌వారం ముగింపు కార్య‌క్ర‌మానికి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా హాజ‌రు కానున్నారు. ఈ కాన్ఫరెన్స్ కు 32 మంది స్పీకర్లు, పలువురు డిప్యూటీ స్పీకర్లు, కౌన్సిల్ చైర్మన్ లు డిప్యూటీ చైర్మన్ లు హాజ‌రు కానున్నారు.