IMD | దేశంలో ఎండలు మండిపోతున్నాయి. భానుగు భగ్గున మండుతున్నాడు. పగటి ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటేనే జనం గడగడ వణుకుతున్నారు. ఇప్పటికే ఎండలతో జనం అల్లాడుతుంటే రానున్న ఐదు రోజులపాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.
IMD : దేశంలో ఎండలు మండిపోతున్నాయి. భానుగు భగ్గున మండుతున్నాడు. పగటి ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటేనే జనం గడగడ వణుకుతున్నారు. ఇప్పటికే ఎండలతో జనం అల్లాడుతుంటే రానున్న ఐదు రోజులపాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.
గాలిలో అధిక తేమ కారణంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్లలో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటారని ఐఎండీ పేర్కొంది. మంగళవారం తూర్పు మధ్యప్రదేశ్లో రాత్రి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్, జూన్ నెలల్లో 10 నుంచి 20 రోజుల పాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నప్పుడు తీవ్రమైన వేడి తరంగాలు (Heatwave) ఏర్పడతాయని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా, బీహార్, జార్ఖండ్లలో ఎక్కువ వేడి తరంగాలు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతోపాటు రానున్న మూడు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వెల్లడించింది.