బెంగళూరు : కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది. గత అనుభవాలను, అంతర్జాతీయంగా అనుసరిస్తున్ననమూనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో నిర్వహించాలన్న ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ఈ నిర్ణయంపై బీజేపీ ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. రాష్ట్రాలకు ఆ అధికారం ఉందని డీకే శివకుమార్ చెప్పారు. బ్యాలెట్ అనగానే బీజేపీ ఎందుకు వణుకుతున్నదని ఆయన ప్రశ్నించారు. బ్యాలెట్తో ఎన్నికలకు వెళ్లడంపై బీజేపీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఓడినప్పుడల్లా ఈవీఎంలనే బద్నాం చేస్తున్నదని బీజేపీ ఆరోపించింది.
బ్యాలెట్ పద్ధతిలో స్థానిక ఎన్నికలు..ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది.

Latest News
2025 లో 4 లక్షల ఉద్యోగాలు ఉఫ్...కొంపలు కూల్చుతున్న ఏఐ
మే 12న నర్సింగ్ ఆఫీసర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్: మంత్రి దామోదర
ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాలకు వరం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ. ఆనంద్
హైదరాబాద్ లో ఇంధన కొరత..రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
సుప్రీంకోర్టు ఆదేశాలతో బతుకమ్మ కుంట వద్ద బోర్డుల తొలగింపు
అండర్గ్రాడ్యుయేట్స్కు నెరవేరని 5 లక్షల వార్షికవేతనం కల.. తాజా అధ్యయనంలో కీలక అంశాలు
రేపు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
గూగుల్ డేటా సెంటర్.. ఏపీకి గేమ్ ఛేంజర్ : సీఎం చంద్రబాబు
అమరావతి-హైదరాబాద్ బుల్లెట్ రైలు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్