వేలాడుతున్న కరెంటు తీగ తగిలి 9 నెలల చిన్నారి, తల్లి మృతి
ఫుట్పాత్ మీద నడుస్తున్న ఓ యువతికి వేలాడుతున్న కరెంటు తీగ తాకడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ ఘటనలో ఆమె తొమ్మిది నెలల చిన్నారి కూడా చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది

విధాత: ఫుట్పాత్ మీద నడుస్తున్న ఓ యువతికి వేలాడుతున్న కరెంటు తీగ తాకడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ ఘటనలో ఆమె తొమ్మిది నెలల చిన్నారి కూడా చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. కరెంటు సరఫరా సంస్థ నిర్లక్ష్యం కారణంగా రెండు నిండు ప్రాణాలు బలి అయిపోయిన ఈ ఘటన బెంగళూరు (Bengaluru) లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. 23 ఏళ్ల సౌందర్య అనే యువతి, ఆమె తొమ్మిది నెలల కుమార్తె సువేక్ష కలిసి బెంగళూరు వైట్ఫీల్డ్లోని హోప్ ఫాం జంక్షన్లో ఉదయం 6 గంటలకు నడుచుకుంటూ వెళుతున్నారు.
By stepping on a stray live wire on the road, a mother and her 9-month-old daughter died on the spot in the Hope Farm junction in #Whitefield’s #Kadugodi at 5AM on November 19th. This is a case of negligence from the Bangalore Electricity Supply Company Limited (#BESCOM).… pic.twitter.com/ZL8eVriLcp
— Hate Detector