విధాత, హైదరాబాద్ : రైతుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు బహుళ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. రైతులు ఎదుర్కొంటున్న తాత్కాలిక సమస్యలను ఆ కమిటీకి తెలపాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను కోరింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తెలిపింది. హర్యానాలోని అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలుచేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 12న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు నిరసన తెలుపుతున్న రైతులతో తాము సమావేశం నిర్వహించామని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకు తెలియజేసింది. అంతేకాక, జాతీయరహదారిపై ఏర్పాటుచేసిన బారికేడ్లను పాక్షికంగా తొలగించేందుకు అంగీకరించినట్లు వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రైతు ఉద్యమం సందర్భంగా చలో ఢిల్లీని అడ్డుకునేందుకు రాష్ట్రప్రభుత్వం బారికేడ్లను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే వాటిని వారంలోగా తొలగించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
Supreme Court | రైతుల సమస్యలపై బహుళ కమిటీ..సుప్రీం కోర్టు వెల్లడి
రైతుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు బహుళ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. రైతులు ఎదుర్కొంటున్న తాత్కాలిక సమస్యలను ఆ కమిటీకి తెలపాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను కోరింది

Latest News
ట్రెండింగ్లో ‘రయ్ రయ్ రా రా’.. చెర్రీ డాన్స్కు ఇండియా ఫిదా
మాస్టర్ టెలికమ్యూనికేషన్స్లో గెలాక్సీ ఎస్26 సిరీస్ విక్రయాలు ప్రారంభం
టి20 ప్రపంచకప్ సెమీస్: ఫైనల్లో టీమిండియా – మరోసారి సంజూ మ్యాజిక్
సంజూ తుఫాన్.. సెమీస్లో ఇంగ్లండ్ ముందు 254 పరుగుల కొండంత లక్ష్యం
111 జీవో పరిధిలో పొంగులేటి అక్రమ మైనింగ్.. వెంటనే బర్తరఫ్ చేయాలన్న బీఆర్ఎస్ నేత ప్రవీణ్
ఎంపీ మల్లు రవి భార్య భూమికి ఎన్వోసీ
వామ్మో... ఏఐ గ్లాసెస్తో ఇన్ని డేంజర్లా? మీ బెడ్రూమ్ యాక్టివిటీ కూడా చూసేస్తారు!
రంగోలి చీరలో అనసూయ ఖతర్నాక్ ఫోటోలు
అభివృద్దికి ఇప్పుడు సంతానోత్పత్తి కీలకం : ఏపీ సీఎం చంద్రబాబు
అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం