విధాత, హైదరాబాద్ : రైతుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు బహుళ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. రైతులు ఎదుర్కొంటున్న తాత్కాలిక సమస్యలను ఆ కమిటీకి తెలపాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను కోరింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తెలిపింది. హర్యానాలోని అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలుచేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 12న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు నిరసన తెలుపుతున్న రైతులతో తాము సమావేశం నిర్వహించామని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకు తెలియజేసింది. అంతేకాక, జాతీయరహదారిపై ఏర్పాటుచేసిన బారికేడ్లను పాక్షికంగా తొలగించేందుకు అంగీకరించినట్లు వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రైతు ఉద్యమం సందర్భంగా చలో ఢిల్లీని అడ్డుకునేందుకు రాష్ట్రప్రభుత్వం బారికేడ్లను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే వాటిని వారంలోగా తొలగించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
Supreme Court | రైతుల సమస్యలపై బహుళ కమిటీ..సుప్రీం కోర్టు వెల్లడి
రైతుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు బహుళ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. రైతులు ఎదుర్కొంటున్న తాత్కాలిక సమస్యలను ఆ కమిటీకి తెలపాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను కోరింది

Latest News
ఏలియన్ల రహస్యాలు అతి త్వరలో.. : ట్రంప్ తాజా సంచలనం
భారత్కు వస్తున్న ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ కాల్పులు
ఈ అక్షయ తృతీయకు బంగారం 'హైజంప్'
రిజిస్ట్రేషన్లకు కొత్త రూల్.. సర్వే మ్యాపు ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్.. భూ సమస్యలకు చెక్
పురాతన భావాలు కాలగర్భంలో కలిసిపోక తప్పదు!
నాసా ప్రపంచపు నైట్లైట్ మ్యాప్లో యూపీ-బీహార్ ‘హైలైట్’
రైతు భరోసా రెండో విడత ఎల్లుండే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
మోమోస్ ఎఫెక్ట్... మెమోరీలాస్.. లివర్ ఫెయిల్యూర్.. కనీసం నిలబడలేకపోయిన పదేళ్ల చిన్నారి...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త