కాలువలో కొట్టుకపోయిన వాహనం..9మంది మృతి

మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాల మధ్య రాజ్‌గఢ్ జిల్లాలో కాలువలో వ్యాన్ కొట్టుకుపోయి 9 మంది మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి వాహనం ప్రవాహంలో చిక్కుకోగా ఇద్దరు ఈదుకుంటూ ప్రాణాలు దక్కించుకున్నారు.

మధ్యప్రదేశ్ రాజ్ గఢ్ లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద ఉదృతితో ప్రవాహిస్తున్న ఓ కాలువలో ప్రయాణికుల వ్యాన్ కొట్టుకపోయిన ప్రమాదంలో 9 మంది మరణించారు. ప్రమాద సమయంలో వ్యాన్ లో 11 మంది ప్రయాణికులు ఉన్నారు.

రాజ్‌గఢ్‌లో పచోర్-సారంగ్‌పూర్ రోడ్డులోని పద్దనా పట్టణం వద్ద నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి ‘ఈకో’ (Eco) వ్యాన్ కాలువలో పడి కొట్టుకుపోయింది. ఇందులో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారు. భారీ వర్షం కారణంగా వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. అసంపూర్తిగా ఉన్న వంతెనను కారు డ్రైవర్ గమనించలేదు. అయోమయంలో అతను కారును వంతెనపైకి నడపడంతో, అది కాలువలోకి కొట్టుకుపోయింది. ఇద్దరు వ్యక్తులు ఈదుకుంటూ బయటపడగా, మిగిలిన వారు వాహనంలోనే చిక్కుకుపోయారు.

ఇప్పటివరకు 5 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం రక్షణ బృందాలు గాలిస్తున్నాయి. ఆ వాహనంలోని వారందరూ దేవాస్ నివాసితులు. వారు సత్వాస్ నుండి కడ్లావాడ్ గ్రామానికి వెళ్తున్నారు. వారిలో ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు.

Latest News