Site icon vidhaatha

పుంగనూరు ఆవులతో ప్రధాని మోడీ

విధాత : ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి పండుగ సందర్భంగా తన నివాసంలో పుంగనూరు ఆవులకు పూజలు నిర్వహించి వాటికి మేత పెట్టిన దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో సందడి చేశాయి. కామధేనూకు ప్రతిరూపంగా, మేలుజాతి ఆవులుగా, అత్యంత నాణ్యమైన పాల దిగుబడులిచ్చేవిగా గుర్తించబడే పుంగనూరు ఆవులు అరుదైన పశుసంతతిగా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. నిత్యం ప్రధానిగా బిజీగా ఉండే మోడీ ఆదివారం కేంద్ర మంత్రి ఎల్‌.మురగన్ నివాసంలో సంక్రాంతి వేడుకల్లో పంచెకట్టుతో హాజరయ్యారు. గోపూజల్లో, సంక్రాంతి పాయసం వంటకాల్లో పాల్గొన్నారు. అనంతరం తన నివాసానికి వెళ్లిన మోడీ పుంగనూరు ఆవుల పోషణలో పాలుపంచుకున్నారు. రామాలయం ప్రారంభం వరకు తాను సాత్విక ఆహారంతో దైనందిక నిష్టా కార్యక్రమాలతో గడుపుతానన్న మోడీ ఆ మేరకు తన దిన చర్యలను పాటిస్తున్నారు.



 


Exit mobile version