విధాత : పార్లమెంట్ సమావేశాల్లో మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలుగులో మాట్లాడి ప్రత్యేకతను చాటారు. జీరో అవర్లో భాగంగా తనకు మొదటిసారి మాట్లాడే అవకాశం కల్పించినందుకు స్పీకర్కు ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. నియోజకవర్గం పరిదిలోని పటాన్ చెరు అనేది ఆసియాలో పెద్ద ఇండస్ట్రీయల్ ఏరియా, మెదక్ జిల్లా ఇండస్ట్రీలకు ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు సర్వే కూడా పూర్తయిన 225 కిలోమీటర్ల రైల్వే లైన్ వెంటనే నిర్మాణం చెయ్యాలని పార్లమెంట్ లో విజ్ఞప్తి చేశారు.అయితే తెల్లాపూర్, పటాన్ చెరువు, సంగారెడ్డి, జోగిపేట, మెదక్, రామాయంపేట, సిద్దిపేట వరకు రైల్వే లైన్ సర్వే పూర్తయ్యి పనులు మాత్రం మొదలు కాలేదని వెల్లడించారు. 44 ఏళ్ల నుంచి కేవలం 9 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి అయిందని, దాన్ని కూడా ఆదాయం రావడం లేదని రైళ్ల రాకపోకలు నిలిపివేశారని చెప్పారు. తెలంగాణాలో అన్ని జిల్లాలకు రైల్వే స్టేషన్ ఉందని, కానీ తమ జిల్లా కేంద్రం ఒక్క సంగారెడ్డికి మాత్రమే రైల్వే స్టేషన్ లేదని, వీలైనంత త్వరగా తమ రైల్వే లైన్ పూర్తి చేయాలని కోరారు.
MP Raghunandan Rao | పార్లమెంటులో మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలుగు ప్రసంగం
పార్లమెంట్ సమావేశాల్లో మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలుగులో మాట్లాడి ప్రత్యేకతను చాటారు. జీరో అవర్లో భాగంగా తనకు మొదటిసారి మాట్లాడే అవకాశం కల్పించినందుకు స్పీకర్కు ధన్యవాదాలు తెలిపారు.

Latest News
రూ.10 కోట్ల లాటరీ గెలిచిన డ్రైవర్ : రాత్రికిరాత్రే మారిపోయిన జీవితం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది : ఈనెల 24న లేదా 27న
రాత్రి బెడ్లైట్ వేసుకొని పడుకుంటున్నారా..? గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 50 శాతం అధికమట జాగ్రత్త
చీరల కోసం ఉదయం 4 గంటల నుంచే షోరూమ్ ముందు బారులు తీరిన మహిళలు.. ఎందుకంత డిమాండ్..?
రియల్ మీ బాహుబలి బ్యాటరీ మొబైల్ లాంచ్ డేట్ ఫిక్స్ !
క్యాబినెట్ పరిమాణంపై పరిమితులు.. దొడ్డిదోవన సలహాదారుల పేరిట పందేరం.. సేవ కోసమా? ప్రాపకం కోసమా?
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై జబర్ధస్త్ తగదు : హైకోర్టు కీలక ఆదేశాలు
అల్లు-మెగా వార్ నడుమ బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్..
స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..ఒక్క రోజులోనే రూ.9లక్షల కోట్ల సంపద హుష్ !
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత..పోలీసుల లాఠీచార్జ్