విధాత : పార్లమెంట్ సమావేశాల్లో మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలుగులో మాట్లాడి ప్రత్యేకతను చాటారు. జీరో అవర్లో భాగంగా తనకు మొదటిసారి మాట్లాడే అవకాశం కల్పించినందుకు స్పీకర్కు ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. నియోజకవర్గం పరిదిలోని పటాన్ చెరు అనేది ఆసియాలో పెద్ద ఇండస్ట్రీయల్ ఏరియా, మెదక్ జిల్లా ఇండస్ట్రీలకు ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు సర్వే కూడా పూర్తయిన 225 కిలోమీటర్ల రైల్వే లైన్ వెంటనే నిర్మాణం చెయ్యాలని పార్లమెంట్ లో విజ్ఞప్తి చేశారు.అయితే తెల్లాపూర్, పటాన్ చెరువు, సంగారెడ్డి, జోగిపేట, మెదక్, రామాయంపేట, సిద్దిపేట వరకు రైల్వే లైన్ సర్వే పూర్తయ్యి పనులు మాత్రం మొదలు కాలేదని వెల్లడించారు. 44 ఏళ్ల నుంచి కేవలం 9 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి అయిందని, దాన్ని కూడా ఆదాయం రావడం లేదని రైళ్ల రాకపోకలు నిలిపివేశారని చెప్పారు. తెలంగాణాలో అన్ని జిల్లాలకు రైల్వే స్టేషన్ ఉందని, కానీ తమ జిల్లా కేంద్రం ఒక్క సంగారెడ్డికి మాత్రమే రైల్వే స్టేషన్ లేదని, వీలైనంత త్వరగా తమ రైల్వే లైన్ పూర్తి చేయాలని కోరారు.
MP Raghunandan Rao | పార్లమెంటులో మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలుగు ప్రసంగం
పార్లమెంట్ సమావేశాల్లో మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలుగులో మాట్లాడి ప్రత్యేకతను చాటారు. జీరో అవర్లో భాగంగా తనకు మొదటిసారి మాట్లాడే అవకాశం కల్పించినందుకు స్పీకర్కు ధన్యవాదాలు తెలిపారు.

Latest News
Honeymoon Tragedy | పెళ్లయిన గంటల్లోనే విషాదం.. హనీమూన్కు వెళ్తుండగా కుప్పకూలిన హెలికాప్టర్.. భారత సంతతి వరుడు మృతి
Switzerland | భారతీయ పర్యాటకురాలికి స్విట్జర్లాండ్ పోలీసుల షాక్.. టూర్కు వెళ్లొచ్చిన ఏడాదికి రూ.1.5లక్షల ఫైన్ చెల్లించాలని నోటీసులు!
Murder Mystery | కొడుకు కనబడట్లేదని హైకోర్టు మెట్లు ఎక్కిన తల్లి.. సిట్ విచారణలో దృశ్యం మూవీని మించిన ట్విస్టులు!
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా… ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్
జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’
ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదు: ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్
సింధూ లోయ పశుపతి ముద్రపై కొత్త రచ్చ !
కాక్రోచ్ జనతా పార్టీ తొలి టార్గెట్ ధర్మేంధ్ర ప్రధాన్ .. ధర్నాకు పిలుపు
జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త: రాహుల్ గాంధీ హెచ్చరిక
Pooja Hegde | అభిమానిని పట్టించుకోలేదంటూ ట్రోలింగ్.. అసలు నిజం చెప్పిన పూజా హెగ్డే!