Site icon vidhaatha

Warangal: లొంగిపోయిన 14 మంది మావోయిస్టులు

విధాత ప్రత్యేక ప్రతినిధి: సిపిఐ మావోయిస్టు పార్టీ కి చెందిన 14 మంది సభ్యులు మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఎదుట వరంగల్ కమీషనరేట్ నందు గురువారం లొంగిపోయారు. నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని వివిధ హోదాలో పనిచేయుచున్న 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏరియా కమిటీ సభ్యులు (ACM)- 02, పార్టీ సభ్యులు (PM) – 07, మిలిషియా కమాండర్ – 01, మిలిషియా సభ్యులు – 04, మొత్తం 14 మంది లొంగిపోయారు. వరంగల్లో గురువారం మీడియా సమావేశంలో ఐ జి చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపి సన్ ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

లొంగిపోయిన వారి వివరాలు:

AOBSZC డివిజన్ గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు మడవి అంద @ రాజేష్, మరియు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి @ ఉదయ్ కి చెందిన ప్రొటెక్షన్ టీం ఏరియా కమిటీ సభ్యురాలు సోడి కోసి, డివిజన్ కమిటీ సభ్యులు మరకం హిడుమే, మడకం జోగి @ కోవాసి జోగి, పోడియం భూమిక @ సోడి కోసి @ వెన్నెల, సోడి బుద్రి @ బద్రి, మడవి పూజే, హేమ్లా సోను, సోడి రమేష్ @ భీమా మిలిషియా సభ్యులు అట్టం బుద్ర, కోవాసి ఇడుమ, కోర్సా లాలు, హేమ్లా సుక్కు @ అర్జున్, కోర్సా సుక్కు లొంగిపోయినవారు ఛత్తీసగఢ్, ఒరిస్సా రాష్ట్రలలో పలు విధ్వంసకర సంఘటనలలో, పోలీసులపై దాడి చేసిన ఘటనలలో, ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేసిన సంఘటనలలో పాల్గొన్నారు.

నక్సల్ వ్యతిరేకంగా విశేషంగా కృషి

ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు నక్సల్ వ్యతిరేక కార్యక్రమాలలో విశేషంగా కృషి చేశారని తెలిపారు. జనవరి, 2024 నుండి ఈ రోజు వరకు వజరిగిన ఎదురు కాల్పులలో 18 మంది సాయుధ మావోయిస్టులు, వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు చనిపోయారని చెప్పారు. జనవరి, 2025 నుండి నేటి వరకు వివిధస్థాయిలలో పని చేస్తున్న 12 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని, ఒక రాష్ట్ర కమిటీ సభ్యురాలితో పాటు మొత్తం 250 మంది మావోయిస్టులు స్వచ్చందంగా పోలీసుల ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిశారని వివరించారు. దేశంలోనే అత్యుత్తమమైన సరెండర్ పాలసీని తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సరెండర్ పాలసీలో భాగంగా తక్షణమే వారికి పునరావాసాన్నీ తెలంగాణ పోలీస్ శాఖ కల్పిస్తుందన్నారు.ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ కమిషనరేట్ పోలీసుల సమక్షంలో  అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను ప్రభుత్వం ఎదుట లొంగి పోవడానికి నిర్వహిస్తున్న “పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి” “ఆపరేషన్ చేయూత ” వంటి అనేక ఆదివాసీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తుందన్నారు.

Exit mobile version