శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

విధాత,హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్‌ కేసుల్లో పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ కేసులు మొదట విచారణ జరపాలన్న సీబీఐ కోర్టు నిర్ణయంపై విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ పిటిషన్లు దాఖలు చేశాయి. మొదట సీబీఐ కేసులు కుదరకపోతే రెండూ సమాంతరంగా విచారణ జరపాలని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది కోరారు. మొదట విచారణ జరిపి అవసరమైతే తీర్పు వాయిదా వేయాలని ఈడీ తరఫు న్యాయవాది ప్రతిపాదించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో మొదట ఏది విచారణ జరపాలన్న […]

  • By: Venkat |    news |    Published on : Jul 09, 2021 12:06 PM IST
శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

విధాత,హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్‌ కేసుల్లో పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ కేసులు మొదట విచారణ జరపాలన్న సీబీఐ కోర్టు నిర్ణయంపై విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ పిటిషన్లు దాఖలు చేశాయి. మొదట సీబీఐ కేసులు కుదరకపోతే రెండూ సమాంతరంగా విచారణ జరపాలని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది కోరారు. మొదట విచారణ జరిపి అవసరమైతే తీర్పు వాయిదా వేయాలని ఈడీ తరఫు న్యాయవాది ప్రతిపాదించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో మొదట ఏది విచారణ జరపాలన్న అంశంపై స్పష్టత లేదని ఇరువైపుల న్యాయవాదులు పేర్కొన్నారు. వివిధ కోర్టు తీర్పులు పరిశీలించి సమగ్ర విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.

ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టుకు హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ ఛార్జిషీట్‌పై విచారణ ఆపాలన్న శ్రీలక్ష్మి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సరిహద్దు వివాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు విచారణ ఆపాలని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోరారు. ఓఎంసీ కేసు దర్యాప్తు పూర్తయిందని, మరో చార్జిషీట్‌ వేయబోమని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. దర్యాప్తు అధికారి వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టు ఇప్పటికే పరిగణనలోకి తీసుకుందని తెలిపింది. మౌఖికంగా చెబితే సరిపోదని, లిఖితపూర్వకంగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు సీబీఐ కోర్టులో తనపై విచారణ ఆపాలని శ్రీలక్ష్మి కోరారు.

వాదనలు వినిపించనందుకు సీబీఐ కోర్టు ఇప్పటికే రూ.4వేలు జరిమానా విధించిందని, ఈనెల 12న వాదనలు వినిపించకపోవతే డిశ్చార్జి పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ కోర్టు తెలిపిందని శ్రీలక్ష్మి హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మార్‌ ఈడీ కేసులో కోనేరు ప్రదీప్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తన సోదరుడు కోనేరు మధుపై కేసు తొలగించారని ప్రదీప్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. కోనేరు మధుపై కేసు తొలగింపును సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని ఈడీ తెలిపింది. కోనేరు ప్రదీప్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. ఈడీ కేసు నుంచి తొలగించాలన్న ఇండియా సిమెంట్స్‌ ఎండీ శ్రీనివాసన్‌ పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. సీబీఐ కేసు నుంచి తనపేరు తొలగించినందున ఈడీ కేసు నుంచి కూడా తొలగించాలని శ్రీనివాసన్‌ కోరారు. జగన్‌ అక్రమాస్తులపై ఈడీ కేసులో శ్రీనివాసన్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.