హైదరాబాద్‌లో.. సురానా గ్రూప్‌పై ED దాడులు!

  • By: sr    news    Apr 16, 2025 1:55 PM IST
హైదరాబాద్‌లో.. సురానా గ్రూప్‌పై ED దాడులు!

విధాత: హైదరాబాద్ లో సురానా గ్రూప్‌ చైర్మన్‌, డైరెక్టర్ ఇళ్లలో చెన్నై ఈడీ అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాయి. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సురానా గ్రూప్‌తోపాటు సాయిసూర్య డెవలపర్స్‌ ఎండీ సతీష్‌చంద్ర గుప్తా నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

సురానా గ్రూప్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సాయిసూర్య డెవలపర్స్ సంస్థలు హైదరాబాద్‌లో పలు కంపెనీలకు భూములను అమ్మకడం సాగించాయి. సురానా గ్రూప్‌ చెన్నై ఎస్ బీఐ నుంచి వేల కోట్లు రుణాలు తీసుకుని మోసానికి పాల్పడిందన్న అభియోగాలతో 2012లో సురానా గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. 400 కేజీల బంగారం స్వాధీనం చేసుకుంది.

అయితే బీఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం మాయమవ్వడం ఈ కేసులో సంచలనంగా మారింది. మాయమైన 103కిలోల బంగారం ఏమైందో తేల్చాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు పవర్‌ సెక్టార్‌లో ఉన్న సురానా గ్రూప్‌ సంస్థలన్నింటిపై ఈడీ సోదాలు చేపట్టింది.