ICC T20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. నలుగురు భారతీయులకు చోటు

ICC T20
గతేడాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన 11 మంది అంతర్జాతీయ క్రికెటర్లతో కూడిన జట్టును ఐసీసీ (ICC )ప్రకటించింది. భారత్ కు 17 ఏండ్ల అనంతరం టీ20 ప్రపంచకప్ అందించిన భారత జట్టు సారథి రోహిత్ శర్మ ను ఐసీసీ జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేసింది. ఐసీసీ టీ20 టీమ్లో రోహిత్ సహా మరో ముగ్గురు టీమిండియా ప్లేయర్లకు చోటు లభించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ హర్దిక్ పాండ్య, లెఫ్టార్మ్ సీమర్ అర్దీప్ సింగ్ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
గతేడాది టీ20ల్లో రోహిత్ శర్మ 11 మ్యాచ్లో 42 సగటుతో 378 పరుగులు సాధించాడు. 2024లో జరిగిన టీ20 మెగా సమరంలో టీమ్ ఇండియా విశ్వవిజేతగా అవతరించడంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో మూడు హాఫ్ సెంచరీలతో పాటు సూపర్ 8 దశలో ఆస్ట్రేలియాపై 92 పరుగులతో జట్టును ఒంటి చేత్తో ఫైనల్ చేర్చాడు. ఇక, సీనియర్ పేసర్ బుమ్రా గతేడాది 8 మ్యాచ్లో 15 వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించాడు. యువ పేసర్ అర్దీప్ సింగ్ 18 మ్యాచ్లో 13.50 సగటుతో 36 వికెట్లు తీసి అదరగొట్టాడు. హార్దిక్ పాండ్య 17 మ్యాచ్లలో 16 వికెట్లు తీయడంతో పాటు 352 పరుగులతో ఆల్రౌండర్లలో టాప్ ర్యాంకర్గా నిలిచాడు.
ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలి యా). ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), బాబర్ అజామ్ (పాకిస్థాన్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్; వెస్టిండీస్), సికందర్ రజా (జింబాబ్వే), హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్ (అఫ్ఘానిస్థాన్), వానిందు హసరంగ (శ్రీలంక), జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.