Site icon vidhaatha

వరంగల్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయండి.. పార్లమెంట్‌లో ఎంపీ కావ్య‌

విధాత ప్రత్యేక ప్రతినిధి: ఎంతో గొప్ప చారిత్రక వారసత్వ ప్రదేశాలకు నిలయంగా ఉన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లా లోని వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, కాకతీయ కళాతోరణం వంటి పర్యాటక ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య అన్నారు. పార్లమెంట్లో మంగళవారం ఆమె మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా నిలిచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు జాతీయ హోదా కల్పించాలన్నారు.

వరంగల్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల వరంగల్ ప్రాంతవాసులకు ఉపాధి మరియు ఆదాయం లభిస్తుందన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో వరంగల్ నగరం పర్యాటకంగా ఎంతగానో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ పర్యాటక రంగానికి సమగ్ర అభివృద్ధికి చర్యలు ప్రారంభించవలసిందిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని అభ్యర్థించారు.

Exit mobile version