Prakashraj: పర్యావరణ విధ్వంసం ఆమోద యోగ్యం కాదు

హెచ్ సీయు భూముల వివాదంపై ప్రకాశ్ రాజ్ ఫైర్
విధాత: హెచ్ సీయూ భూముల వివాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా తన వైఖరి వెల్లడించారు. హెచ్ సీయూ భూముల్లో పర్యావరణ విధ్వంసం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని ట్వీట్ చేశారు. ఈ వివాదంలో విద్యార్థులు, ప్రజలు, నటులు వ్యక్తం చేస్తున్న ఆందోళనకు తన సంఘీభావం తెలిపారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
మన భవిష్యత్తు కోసం ఈ నిరసనను షేర్ చేసి మరింత విస్తృతం చేయవలసిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. హెచ్ సీయూ భూముల వివాదంలో ఇప్పటికే దర్శకుడు నాగవంశీ సహా పలువురు సినీ రంగ సెలబ్రెటీలు పర్యావరణ పరిరక్షణ కోణంలో విద్యార్థుల ఆందోళనకు మద్ధతు పలకడం గమనార్హం.