విధాత: జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26మందిని కాల్చిచంపిన ఘటనపై సినీ రంగ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మృతుల సానభూతి తెలుపుతున్నారు. ఉగ్రదాడిపై చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, అక్షయ్ కుమార, కమల్ హాసన్, మోహన్ లాల్, సంజయ్ దత్ తదితర సెలబ్రిటీలు స్పందించారు.
ఉగ్రమూకలను అంతమొందించాలి : విజయ్ దేవరకొండ
ఉగ్రదాడి ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన హీరో విజయ్ దేవరకొండ తాను రెండేళ్ల క్రితమే పహల్గామ్లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా నా పుట్టిన రోజును అక్కడే సెలబ్రేట్ చేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. కశ్మీర్లోని అందమైన ప్రాంతంలో అక్కడి స్థానిక ప్రజల స్వచ్ఛమైన నవ్వుల మధ్య నా పుట్టినరోజు జరుపుకున్నాను. కశ్మీరీ స్నేహితులు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉగ్రదాడి ఘటన సమాచారం విని నా హృదయం చలించిపోయింది. ఎంతో కోపాన్ని తెప్పించింది. ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం అత్యంత సిగ్గుచేటు.. పిరికిపంద చర్య. ఇలాంటి పిరికి వాళ్లను త్వరలోనే అంతమొందిస్తారని ఆశిస్తున్నాను. బాధితులకు, వారి కుటుంబాలకు మేము అండగా నిలుస్తాం. భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదానికి తలవంచదని విజయ్ దేవరకొండ తన పోస్ట్లో రాసుకొచ్చారు.
I celebrated my birthday 2 years ago in Pahalgam, amidst shooting a film, amidst laughter, amidst my local Kashmiri friends who took the greatest care of us..
What happened yesterday is heartbreaking and infuriating – calling yourself a Force and shooting tourists is the most…
— Vijay Deverakonda (@TheDeverakonda) April 23, 2025
క్రూరమైన చర్య : చిరంజీవి
పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ క్షమించరాని క్రూరమైన చర్య అని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ & కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది అమాయక ప్రజలు, పర్యాటకులను చంపిన ఘటన భయంకరమైన దాడి.. హృదయ విదారకమైనదన్నారు. మృతుల కుటుంబాలకు నా హృదయ పూర్వక సంతాపం వ్యక్తం చేశారు. వారికి జరిగిన నష్టాన్ని ఏదీ పూడ్చదని.. వారికి నా సంతాపం తెలుపుతున్నానని పేర్కొన్నారు.
The ghastly attack killing 26 innocent people and tourists in Pahalgam, Jammu & Kashmir is horrifying and heartbreaking. It is an unpardonable act of cruelty.
My heart goes out to the families of those killed. Nothing can undo the loss they suffered. My condolences and prayers…
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 23, 2025
గుండె పగిలింది : అల్లు అర్జున్
పహల్గామ్ దాడితో నా గుండె ముక్కలైందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. దయగల ప్రజలతో కూడిన అందమైన ప్రదేశం ఆ ప్రాంతమని… అలాంటి చోట ఈ ఉగ్రదాడి జరగడం నన్ను బాధిస్తుందన్నారు. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. వారి అమాయక ఆత్మలు శాంతించాలని.. నిజంగా ఈ ఘటన హృదయాన్ని ముక్కలు చేస్తుందని అల్లు అర్జున్ ఆవేదన చెందారు.
Soo heart broken by #Pahalgam Attack . Such a beautiful place with kind hearted people . Condolences to all the families, near and dear of the victims. May their innocent souls rest in peace . Truly Heart breaking
— Allu Arjun (@alluarjun) April 23, 2025
చీకటి రోజు : సూపర్ స్టార్ మహేశ్ బాబు
ఉగ్రదాడి “ఒక చీకటి రోజు… పహల్గామ్లో జరిగిన దాడితో చాలా బాధపడ్డానని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎక్స్ వేదికగా తెలిపారు. ఇలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా కలిసి నిలబడే శక్తి మనకు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి” అని మహేష్ బాబు పోస్ట్ చేశారు.
A dark day… Deeply saddened by the attack in #Pahalgam.
Hope we find the strength to stand together against such cruelty..🙏🏻🙏🏻🙏🏻My thoughts and prayers are with the families during this difficult time….— Mahesh Babu (@urstrulyMahesh) April 23, 2025