ఢిల్లీ: భారత స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్సీఎం) జూన్ 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఒక దశాబ్దంలో రూ.1.64 లక్షల కోట్ల ప్రాజెక్టులతో 100 నగరాల్లో 90% పైగా పనులు పూర్తయ్యాయి. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం… 8,000 ప్రాజెక్టుల్లో 7,500 (రూ.1.5 లక్షల కోట్లు) పూర్తయ్యాయి. ఇది సమ్మిళిత, డేటా ఆధారిత నగరాభివృద్ధికి నాంది పలికింది. ఈ పురోగతి భారత నగరీకరణలో విప్లవాత్మక మార్పులను సూచిస్తుంది.
ప్రధాన అంశాలు
పూర్తైన ప్రాజెక్టులు: 7,500+ ప్రాజెక్టులు, రూ.1.5 లక్షల కోట్ల విలువ.
ప్రధాన రంగాలు: రవాణా, నీరు, పారిశుద్ధ్యానికి 50% ఖర్చు చేశారు
ప్రముఖ రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర మూడింట ఖర్చులో మూడో వంతు చేసేసింది.
సమాన పంపిణీ: 0.96 నార్మలైజ్డ్ ఈక్విటీ స్కోర్తో దాదాపు సమాన ప్రాజెక్టు పంపిణీ.
భద్రత, పర్యావరణం: నేరాలు 27% తగ్గాయి, గాలి నాణ్యత 23% మెరుగుపడింది.
భద్రత, స్థిరత్వం, సమ్మిళిత ప్రభావం
ఎస్బీఐ నివేదిక ప్రకారం, అధిక నిధుల వినియోగ రాష్ట్రాల్లో 2020-2022 మధ్య నేరాలు 1,00,000 జనాభాకు 117 సంఘటనలు తగ్గాయి. అంటే 27% తగ్గాయ్యనమాట. స్మార్ట్ సిటీస్లో ఆరేళ్లలో గాలి నాణ్యత 23% మెరుగుపడింది. ఇందుకు చెట్లు, నిఘా వ్యవస్థలు, శుభ్రమైన రవాణా దోహదపడ్డాయి. 0.96 నార్మలైజ్డ్ ఎంట్రోపీ స్కోర్తో బిహార్, ఛత్తీస్గఢ్ వంటి వెనుకబడిన రాష్ట్రాలు కూడా గణనీయ విజయం సాధించాయి.
టాప్ నగరాలు
రాయపూర్: 342 ప్రాజెక్టులతో అగ్రస్థానం.
ఇండోర్ : 232 ప్రాజెక్టులతో రూ.3,759 కోట్ల ఖర్చు.
వెల్లూర్, పుణె: ప్రాజెక్టుకు రూ.60 కోట్లకు పైగా ఖర్చు.
మౌలిక సదుపాయాలు
83,000 సీసీటీవీ కెమెరాలు, 52 లక్షల ఎల్ఈడీ స్ట్రీట్లైట్లు.
4,700 కి.మీ స్మార్ట్ రోడ్లు, 712 కి.మీ సైక్లింగ్ ట్రాక్లు.
49,300 గృహాల నిర్మాణం.
నిధులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు
కేంద్రం ఐదేళ్లలో రూ.48,000 కోట్లు అందించగా, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు సమాన నిధులు సమకూర్చాయి, రుణాలు, బాండ్లు, ప్రైవేట్ మూలధనాన్ని కూడా వినియోగించాయి. అయితే, పీపీపీ ప్రాజెక్టులు 21% లక్ష్యంతో పోలిస్తే 6% మాత్రమే సాధించాయి. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి దేశాలు చండీగఢ్, లక్నో, పుదుచ్చేరి వంటి నగరాల్లో ప్రాజెక్టులకు సహకరించాయి. ఫ్రాన్స్ $1.5 బిలియన్ల నిధులను కేటాయించింది.
సవాళ్లు, భవిష్యత్తు
అయితే నిధుల సమీకరణం ప్రధాన సవాలుగా మారింది. మున్సిపల్ బాండ్లు, భూమి ఆదాయీకరణ తక్కువగా ఉన్నాయి. 2030 నాటికి నగర ప్రాంతాలు 40% జనాభాను, 75% జీడీపీని సృష్టిస్తాయని అంచనా. నివేదిక… ఆవిష్కరణాత్మక నిధులు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, టెక్ ఆధారిత పాలనను సూచిస్తుంది. నిధుల సమస్యను అధిగమించడం కీలకం. రూ.1.64 ట్రిలియన్ల పెట్టుబడితో భద్రత, జీవన నాణ్యత, స్థిరత్వంలో కనిపించే మెరుగుదలలతో స్మార్ట్ సిటీస్ మిషన్ భారత నగర పునర్నిర్మాణానికి ఉదాహరణగా నిలిచింది.