Nagarjunasagar | స్పిల్వే పనుల పరిశీలన విధాత: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ ను తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కుటుంబ సమేతంగా సందర్శించారు. గురువారం నాగార్జునసాగర్ చేరుకున్న వీరు రెండు రోజులు పాటు సాగర్ లోని ప్రత్యేక పర్యటక ప్రాంతాలను సందర్శించారు. దీనిలో భాగంగా సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ అజయ్ కుమార్, సాగర్ డ్యాం ఎస్ఈ నాగేశ్వరరావులు వారికి స్వాగతం పలికారు. అనంతరం వీరు బుద్ధ వనాన్ని సందర్శించి […]
Nagarjunasagar |
విధాత: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ ను తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కుటుంబ సమేతంగా సందర్శించారు. గురువారం నాగార్జునసాగర్ చేరుకున్న వీరు రెండు రోజులు పాటు సాగర్ లోని ప్రత్యేక పర్యటక ప్రాంతాలను సందర్శించారు. దీనిలో భాగంగా సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ అజయ్ కుమార్, సాగర్ డ్యాం ఎస్ఈ నాగేశ్వరరావులు వారికి స్వాగతం పలికారు.
అనంతరం వీరు బుద్ధ వనాన్ని సందర్శించి బుద్ధ పాదాలకు పుష్పాంజలి ఘటించిన అనంతరం అక్కడ బుద్ధ చరిత వనంలో రావి మొక్కను నాటారు. అనంతరం మహా స్థూపాన్ని పలు ప్రదేశాలను సందర్శించారు.
శుక్రవారం నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ను సందర్శించి అక్కడ డ్యామ్ అంతర్భాగంలోని గ్యాలరీలను, స్పిల్ వే మరమత్తు పనులను పరిశీలించారు. ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్ నాగార్జునసాగర్ లోని విద్యుత్ ఉత్పత్తి వివరాలను ముఖ్య కార్యదర్శి కి తెలియజేశారు.
అటుపై తెలంగాణ టూరిజం లాంచీలో నాగార్జున కొండను చేరుకొని అక్కడ మహా స్తూపం, సింహాల విహారం, అశ్వమేధ యజ్ఞ పునర్మిత కట్టడాలను సందర్శించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను, నాగార్జునకొండ చారిత్రక వివరాలను తెలియజేశారు.
వీరితో పాటు సాగర్ డ్యాం ఈ ఈ మల్లికార్జునరావు, డిఈ లు పరమేష్ ,జెఈ లు సత్యనారాయణ ,కృష్ణయ్య, మాధవి, డ్యాం భద్రత అధికారి భాస్కర్, టూరిజం అధికారులు శ్రీధర్ రెడ్డి , ఎల్లస్వామి తదితరులు ఉన్నారు