Betting Apps | బెట్టింగ్ యాప్స్ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు
బెట్టింగ్ యాప్స్పై నిషేధం కోరుతూ కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

Betting Apps | న్యూఢిల్లీ: బెట్టింగ్ యాప్స్ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్లను నిషేధించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. గత విచారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి నోటీసులు జారీ చేసింది. కేంద్రం వైఖరి తెలుసుకునేందుకు మరొక అవకాశం ఇస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. బెట్టింగ్ యాప్ల నిషేధంపై కేంద్రం సమర్థిస్తుందా?. వ్యతిరేకిస్తుందా? ఎలాంటి యంత్రాంగాన్నీ ఏర్పాటు చేస్తుందో చూద్దామంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణలో మధ్యంతర ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది.
సినిమా హీరోలు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేయకుండా నిషేధం విధించేలా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేఏ పాల్ కోరారు. బెట్టింగ్ యాప్లు కారణంగా కోట్లాదిమంది యువకులు నష్టపోతున్నారని, బలవన్మరణాల పాలవుతున్నారని సుప్రీంకోర్టు దృష్టికి కేఏ పాల్ తన పిటీషనల్ పేర్కొన్నారు.