CM Revanth Reddy | మునుముందు తెలంగాణలో మరిన్ని ప్రపంచ ఈవెంట్లు : సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోందన్నారు.

  • By: TAAZ    news    May 12, 2025 4:15 PM IST
CM Revanth Reddy | మునుముందు తెలంగాణలో మరిన్ని ప్రపంచ ఈవెంట్లు : సీఎం రేవంత్‌రెడ్డి
  • పెట్టుబడుల సాధనలో తెలంగాణ నంబర్ వన్
  • రూ.3లక్షలు కోట్ల పెట్టుబడుల సమీకరణ
  • లక్ష ఉద్యోగాల కల్పన
  • ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా హైదరాబాద్
  • గ్లోబల్ కేపబులిటీ హబ్ గా రాష్ట్రం
  • సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణ..సాధనలో దేశంలోనే నంబర్ వన్ గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి కొత్తగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1 లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని వెల్లడించారు. 2025 దావోస్‌ సదస్సు వేదికగా తెలంగాణ రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనతో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. హైదరాబాద్ నానక్ రామ్ గూడలో సొనాటా సాఫ్ట్ వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించుకున్న సందర్భంగా ఉద్యోగులు, యాజమాన్యం, అందరికీ శుభాభినందనలు తెలిపారు. సొనాటా సాఫ్ట్‌వేర్ అత్యాధునిక ఏఐని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ మహానగరం సాఫ్ట్‌వేర్ రంగంలో, లైఫ్ సైన్సెస్‌ రంగంలో ఇంకా అనేక రంగాల్లో జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)కు హబ్‌గా మారిందని పేర్కొన్నారు. అలాగే ఏఐ-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారిందని, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయని వెల్లడించారు.

సమగ్రాభివృద్ధి దిశగా తెలంగాణ

తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోందన్నారు. రాష్ట్రం పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ నిర్వహణ, ఉద్యోగ సృష్టి, పన్ను వసూళ్లలో నంబర్ వన్ గా ఉందన్నారు. 66 లక్షల మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్‌లో ట్రాన్స్‌జెండర్ స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు.

రాష్ట్రంలో మరిన్ని ప్రపంచ ఈవెంట్లు

డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో ఏఐ నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటిగా పేరుపొందిన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయన్నారు. ఇంకా మరిన్ని ప్రపంచ ఈవెంట్‌లను తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని వెల్లడించారు. ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్‌ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నామని తెలిపారు. విద్యార్థులు..పారిశ్రామికవేత్తలు..వివిధ రంగాల్లో రాణించిన వారంతా హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసడర్లుగా మారండని..మన విజయాలను ప్రపంచానికి చూపండని రేవంత్ రెడ్డి కోరారు.

ఇవి కూడా చదవండి..

Mahesh Goud | ఇంతకీ మీరు రెడ్లా? ముదిరాజులా? : ఈటలకు మహేశ్‌గౌడ్‌ సూటి ప్రశ్న
Snake in Train | వేగంగా దూసుకుపోతున్న రైలు.. టాయ్‌లెట్‌లో పాము!