Site icon vidhaatha

ఈసారైనా అమరావతి కట్టేనా? లేక మళ్ళీ మట్టేనా?: వైఎస్ షర్మిల

విధాత: అమరావతి రాజధానికి 10 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారని..మన ఆశల మీద నీళ్ళు చల్లి వెళ్లారని..ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్నారని..ఈసారైనా అమరావతి కట్టేనా ? లేక మళ్ళీ మట్టేనా ? అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్. షర్మిల నిలదీశారు. ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ ఏపీ కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

ప్రధాని మోదీకి ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని.. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తు రావాలని..10 ఏళ్లుగా చేసిన మోసంపై ఆత్మ విమర్శ చేసుకోవాలని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో అడుగు పెట్టాలని..మరోసారి ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలనడి డిమాండ్ చేశారు.

విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యతగా పేర్కొన్నారని..ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తా అని రాసి సంతకం పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. మాకు అప్పులు వద్దు.. మా భావితరాల మీద ఆ భారం వద్దు.. రాజధాని నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లను 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలని..ఈ ప్రకటన మోదీ చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని..అలాగే 10 ఏళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన షర్మిల డిమాండ్ చేశారు.

Exit mobile version