AsiaCup 2025 | పాకిస్తాన్​తో ఫైనల్​ పోరు –మూడోసారి తలపడనున్న చిరకాల ప్రత్యర్థులు

దాయాదుల పోరు మరోసారి రంగం సిద్ధమైంది. ఆసియాకప్​ 2025 ఫైనల్​ ప్రవేశించిన పాకిస్తాన్​, భారత్​ను మరోసారి ఢీకొనేందుకు రెడీ అయింది. సూపర్​ 4 మ్యాచ్​లో బంగ్లాను ఓడించిన పాక్​ ఫైనల్లో అడుగుపెట్టింది.

AsiaCup 2025 | పాకిస్తాన్​తో ఫైనల్​ పోరు –మూడోసారి తలపడనున్న చిరకాల ప్రత్యర్థులు

దుబాయ్​లో జరుగుతున్న ఆసియాకప్​ 2025 పోటీల్లో నేడు జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్​లో పాకిస్తాన్​ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్​ను 135 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన బంగ్లా, అదే స్కోరును చేదించడంలో తడబడి ఫైనల్​ అవకాశాలను చేజేతులారా చేజార్చుకుంది.

పాకిస్తాన్​ విధించిన 136 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి బంగ్లా కూడా అష్టకష్టాలు పడింది. ఒకసారి గాడితప్పిన జట్టును ఎటువంటి పరిస్థితుల్లోనూ కోలుకోనివ్వకపోవడం పాకిస్తాన్​కు బీఫ్​తో పెట్టిన విద్య. ఆఫ్రిదీ, హరీస్​ రౌఫ్​లు నిప్పులు విసురుతూ, బంగ్లా బ్యాటర్లను వణికించారు. ఇద్దరూ చెరో 3 వికెట్లు తీసి బంగ్లా భరతం పట్టారు. చివరికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులకు పరిమితమైంది.

కాగా, టాస్​ గెలిచి పాక్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించిన బంగ్లాదేశ్​, నిప్పుల్లాంటి బంతులతో పాక్​ను గడగడలాడించింది. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిన పాక్​, కుంటుకుంటూ, దేక్కుంటూ మొత్తానికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేయగలిగింది.