IND vs NZ 3rd ODI | భారత్లో తొలి సిరీస్ గెలిచిన కివీస్ : ఆదుకోలేకపోయిన విరాట్ సెంచరీ
ఇండోర్లో జరిగిన నిర్ణాయక 3వ వన్డేలో న్యూజీలాండ్ 40 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. డారెల్ మిచెల్–గ్లెన్ ఫిలిప్స్ శతకాలతో 337 పరుగుల భారీ స్కోరు చేసిన కివీస్, సిరీస్ను 2–1తో చేజిక్కించుకుంది. విరాట్ కోహ్లీ శతకం, నితీశ్, హర్షిత్ రాణాల హాఫ్ సెంచరీలు వృథా కాగా, భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది న్యూజీలాండ్కు భారత్లో తొలి వన్డే సిరీస్ విజయం.
IND vs NZ 3rd ODI: Virat Kohli’s century in vain as New Zealand seal historic series win in India
విధాత క్రీడా విభాగం | 18 జనవరి 2026 | హైదరాబాద్:
IND vs NZ 3rd ODI | భారత్, న్యూజీలాండ్ల మధ్య జరిగిన సిరీస్ నిర్ణాయక 3వ వన్డేలో భారత్ పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 338 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఛేదనలో విఫలమైన భారత్ 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సిరీస్ 2 – 1 తేడాతో న్యూజీలాండ్ చేజిక్కించుకుంది. భారత్లో వారికేదే తొలి సిరీస్ విజయం కాగా, ఇండోర్లో భారత్కిదే తొలి ఓటమి. ఛేజ్మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ, హర్షిత్ రాణా మెరుపు అర్థసెంచరీలు వృథా అయ్యాయి.
బ్యాట్లు వదిలేసిన భారత వీరులు
338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో ఏమాత్రం పోటీనివ్వకుండా వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్కు స్వర్గధామమైన ఇండోర్ పిచ్పై రోహిత్శర్మ(11), కెప్టెన్ శుభమన్ గిల్(23), శ్రేయస్ అయ్యర్(3), కేఎల్ రాహుల్(1) త్వరగానే అవుట్ కాగా, కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేసాడు. 71 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో పడ్డ భారత్ను నితీశ్కుమార్ రెడ్డి తన తొలి అర్థసెంచరీతో ఆదుకున్నాడు. నితీశ్ (53)అవుటైన కాసేపటికే జడేజా(12) కూడా పెవిలియన్ దారిపట్టడంతో, మళ్లీ కోహ్లీ ఒంటరివాడయ్యాడు. ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. 8వ వికెట్గా క్రీజ్లోకి వచ్చిన హర్షిత్ రాణా ఊహించనివిధంగా రాణించాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ, గెలుపుపై మళ్లీ ఆశలు రేకెత్తించాడు. ఫోర్లు, సిక్స్లతో బౌలర్లను దడదడలాడించిన రాణా అదే ఊపులో తన తొలి హాఫ్ సెంచరీ కూడా చేసి, కివీస్ ఆటగాళ్ల మొహాల్లో ఓటమి చూపించాడు. ఈలోపు తన 54వ వన్డే శతకం పూర్తి చేసుకున్న కోహ్లీ కూడా భారీ షాట్లకు దిగడంతో కావాల్సిన రన్రేట్ మెల్లగా అదుపులోకి వస్తున్నట్లనిపించింది. కానీ, దురదృష్టవశాత్తు భారీ షాట్ కొట్టబోయి, రాణా(52) అవుటవడంతో భారత్ ఇక ఆశలు వదిలేసుకుంది. ఒక పక్క కోహ్లీ ఉన్నా, మరోపక్క వికెట్లు లేకపోవడంతో, ఓటమి తప్పలేదు. చివరికి 46 ఓవర్లలో 296 పరుగులకు ఇండియా అలౌట్ అయింది. కోహ్లీ 124 పరుగులు చేసాడు.

న్యూజీలాండ్ బౌలర్లలో జాక్ ఫౌక్స్, క్రిస్టియన్ క్లార్క్ చెరో 3 వికెట్లు తీసుకోగా, జేడెన్ లెనాక్స్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ న్యూజీలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. తన నిర్ణయం నిరూపిస్తూ, కివీస్ 5 పరుగులకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. మొదటి ఓవర్లోనే నికోల్స్ వికెట్లను సున్నాకే గిరాటేయగా, రెండో ఓవర్లో మరో ఓపెనర్ డియాన్ కాన్వే హర్షిత్రాణా బౌలింగ్లో స్లిప్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇద్దరి స్థానాలను ఆక్రమించిన డెరెల్ మిచెల్, విల్ యంగ్ కాసేపు నెమ్మదిగా ఆడి కుదురుకున్నారు. జట్టు స్కోరు 58 పరుగుల వద్ద యంగ్ను హర్షిత్ పెవిలియన్కు పంపగా, వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ మిచెల్తో జతకలిసాడు.
ఇక అక్కన్నుంచి భారత్కు ఏదీ కలిసిరాలేదు. గత రెండు మ్యాచ్లలో వరుసగా 84, 131 పరుగులు చేసి మంచి ఊపు మీదున్న మిచెల్ ఈ మ్యాచ్లోనూ అస్సలు తగ్గలేదు. భారత్తో ఆడిన గత 7 మ్యాచ్లలో నాలుగు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేసిన మిచెల్ ఈ మ్యాచ్లోనూ అదరగొట్టాడు. హోల్కర్ స్టేడియంలోని పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై కివీస్ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) అద్భుత శతకాలతో చెలరేగడంతో 337/8తో భారీ స్కోరు నమోదు చేసింది.
న్యూజీలాండ్ భారీ స్కోరు; మిచెల్–ఫిలిప్స్ శతకాల హోరు

ముఖ్యంగా డారెల్ మిచెల్కు భారత్ స్వర్గధామంగా మారింది. తను చేసిన రెండు శతకాలు భారత్పైనే కావడం విశేషం. మరో వైపు గ్లెన్ ఫిలిప్స్ కూడా నెమ్మదిగా మొదలుపెట్టి తరువాత వేగంగా పెంచాడు. ఈ క్రమంతో తన రెండో వన్డే శతకాన్ని సాధించిన ఫిలిప్స్, . తొలి బౌండరీ కోసం 37 బంతులు తీసుకున్నప్పటికీ, క్రీజులో స్థిరపడిన క్షణం నుంచి దూకుడుగా ఆడి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. మిచెల్–ఫిలిప్స్ జోడీ 219 పరుగుల భారీ భాగస్వామ్యంతో న్యూజీలాండ్ను కష్టస్థితి నుంచి పటిష్టస్థితికి చేర్చారు. నాలుగో వికెట్కు ఇదే కివీస్కు అత్యుత్తమ వన్డే భాగస్వామ్యం.
చివరి దశలో భారత్ వికెట్లు సాధించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండాపోయిది. స్పిన్నర్లకు పెద్దగా సహకారం దక్కకపోవడంతో కివీస్ దూకుడును ఆపడంలో విఫలమయ్యారు. చివరికి నిర్ణీత 50 ఓవర్లలో న్యూజీలాండ్ 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇది ఇండోర్ స్టేడియంలోనే అత్యధిక స్కోరు.
సంక్షిప్త స్కోర్లు:
న్యూజీలాండ్: 8 వికెట్లకు 337 పరుగులు – డారెల్ మిచెల్ 137 పరుగులు(131 బంతులు, 3 సిక్స్లు, 15 ఫోర్లు), గ్లెన్ ఫిలిప్స్ 106 పరుగులు(88 బంతులు, 3 సిక్స్లు, 9 ఫోర్లు) – ఇండియా బౌలింగ్ : అర్షదీప్సింగ్ 3 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు
భారత్: 46 ఓవర్లలో 296 పరుగులు – విరాట్ కోహ్లీ 124 పరుగులు(108 బంతులు, 3 సిక్స్లు, 10 ఫోర్లు), నితీశ్కుమార్ రెడ్డి 53 పరుగులు(57 బంతులు, 2 సిక్స్లు, 2 ఫోర్లు), హర్షిత్ రాణా 52 పరుగులు(43 బంతులు, 4 సిక్స్లు, 4 ఫోర్లు) – న్యూజీలాండ్ బౌలింగ్: జాక్ ఫౌక్స్ 3 వికెట్లు, క్రిస్టియన్ క్లార్క్ 3 వికెట్లు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డారెల్ మిచెల్ – 137 పరుగులు
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: డారెల్ మిచెల్ – 352 పరుగులు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram