India Vs West Indies | వెస్టిండీస్ తో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం

అహ్మదాబాద్‌లో జరిగిన మొదటి టెస్ట్​ మ్యాచ్​లో వెస్టిండీస్‌పై భారత్‌ మూడు రోజుల్లోనే ఘన విజయం సాధించింది. జడేజా 104 నాటౌట్‌, 4 వికెట్లు — సిరాజ్‌ 7 వికెట్లు సాధించి వెస్టిండీస్‌ జట్టును ఇన్నింగ్స్‌ తేడాతో చిత్తు చేశారు.

India Vs West Indies | వెస్టిండీస్ తో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం

Jadeja, Siraj Wrap Up India’s Innings Win Inside Three Days

అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్‌, 140 పరుగుల తేడాతో భారత్‌ విజయపరంపర పునఃప్రారంభం

అహ్మదాబాద్‌ పిచ్‌పై మరోసారి భారత బౌలర్లు దుమ్మురేపారు. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ మాయతో, మొహమ్మద్‌ సిరాజ్‌ వేగంతో వెస్టిండీస్‌ జట్టు మూడో రోజుకే పూర్తిగా కుప్పకూలింది. ఫలితంగా భారత్‌ ఇన్నింగ్స్‌ – 140 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మొదట నిన్న ఆట ముగిసే సమయానికి ఉన్న 448/5 వద్ద డిక్లేర్‌ చేసిన భారత జట్టు, వెస్టిండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌ల్లోనూ చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు కట్టడి చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూల్చింది. జడేజా తన 104 నాటౌట్‌ శతకం తర్వాత బంతితో కూడా చెలరేగి వికెట్లతో వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ను తుత్తునియలు చేశాడు. సిరాజ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7 వికెట్లు పడగొట్టి మరోసారి తన దూకుడు చూపించాడు.

2013 నుండి 2024 వరకు భారత్‌ స్వదేశంలో ఒక్క టెస్ట్‌ సిరీస్‌ కూడా ఓడిపోకపోగా, ఆ రికార్డు గత ఏడాది పుణెలో చెదిరిపోయింది. ఆ తర్వాత తొలి హోమ్‌ సిరీస్‌గా ఈ మ్యాచ్‌ జరిగిన అహ్మదాబాద్‌ టెస్ట్‌లో టీమిండియా మళ్లీ పాత జోరు తెచ్చుకుంది.  వెస్టిండీస్​తో స్వదేశంలో ఒక్క సిరీస్​ కూడా ఓడిపోని టీమిండియా, మరోసారి అదే విజయాన్ని పునరావృత్ం చేసింది. ఇక ఒక్క టెస్టే ఉంది కాబట్టి, ఓడిపోయినా సిరీస్​ డ్రా అవుతుంది. విరాట్‌ కోహ్లీ, అశ్విన్‌, పుజారా లేకుండా ఆడిన తొలి స్వదేశీ మ్యాచ్‌లో జడేజానే మరోసారి టీమిండియాకు బలమైన ఆధారం అయ్యాడు.

Siraj and Jadeja lead India win against West Indies in the first test mat h at Ahmedabad

వెస్టిండీస్‌ తరఫున ఆలిక్‌ అతనేజ్‌ (38) మాత్రమే కొంత ప్రతిఘటన చూపించాడు. స్పిన్‌ బౌలింగ్‌పై ధైర్యంగా ఆడినా, జడేజా మాయకు ఎక్కువసేపు తట్టుకోలేకపోయాడు. టాప్‌ ఆర్డర్‌ మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది. చందర్‌పాల్‌ (0, 8), క్యాంప్‌బెల్‌ (8, 14) మరోసారి నిరాశపరిచారు. మొదటి రోజు రెండు సెషన్లలో 10 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్‌ జట్టు, మూడో రోజూ అదే పొరపాట్లు తిరిగి చేసింది.

జడేజా ఎప్పుడూ కేవలం వేగంగా బంతులు వేస్తాడనే విమర్శలు ఉంటాయి కానీ ,ఈ మ్యాచ్‌లో అతడు బ్యాటర్లను తన స్పిన్​ మాయతో వలలో పడేశాడు. అతని ఫ్లైట్‌, టర్న్‌ అంచనా వేయలేక వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఒక్కరొక్కరుగా వెనుదిరిగారు. మరోవైపు సిరాజ్‌ తన లైన్‌, లెంగ్త్‌తో కొత్త బంతితోనే భీకరంగా దాడి చేశాడు.

మొత్తం మీద మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించిన భారత్‌ మళ్లీ స్వదేశంలో తమ ఆధిపత్యాన్ని నిరూపించింది. వెస్టిండీస్‌కు భారత్‌లో టెస్ట్‌ మ్యాచ్‌ గెలవాలనే కల ఇంకా నెరవేరలేదు — అది ఇప్పుడు 31 ఏళ్లకు చేరింది.

 * ఫలితం: భారత్‌ ఇన్నింగ్స్‌ మరియు 140 పరుగుల తేడాతో విజయం

* మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: రవీంద్ర జడేజా (104*, 4/54)

* బౌలర్లు: మొహమ్మద్‌ సిరాజ్‌ (7 వికెట్లు), బుమ్రా (3/42)

* తదుపరి టెస్ట్‌: ఢిల్లీలో అక్టోబర్‌ 10 నుంచి ప్రారంభం