T20 World Cup Ind Vs USA అమెరికాపై భారత్​ అలవోక విజయం

భారత్​ ఒక మ్యాచ్​ మిగిలుండగానే సూపర్​–8(India in Super-8)లోకి ప్రవేశించింది. నేడు ఇక్కడ అమెరికాతో జరిగిన మ్యాచ్​లో భారత్​ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది..6 పాయింట్లతో సూపర్​8లో ఎంటరయింది

  • By: Tech    sports    Jun 13, 2024 12:12 AM IST
T20 World Cup  Ind Vs USA అమెరికాపై భారత్​ అలవోక విజయం

న్యూయార్క్​: భారత్​ ఒక మ్యాచ్​ మిగిలుండగానే సూపర్​–8(India in Super-8)లోకి ప్రవేశించింది. నేడు ఇక్కడ అమెరికాతో జరిగిన మ్యాచ్​లో భారత్​ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. లో స్కోరింగ్​ మ్యాచ్​ల టోర్నీ(Low Scoring Tourney)గా మారిన ఈ ప్రపంచకప్​లో మరో మ్యాచ్​ అదే దారిలో పయనించింది. మూడు మ్యాచ్​లో 6 పాయింట్లతో సూపర్​8లో ఎంటరయింది. సూపర్​8లో చేరిన తొలిజట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది.

పురుషుల టి20 ప్రపంచకప్​(Mens T20 Cricket World Cup) లో భాగంగా న్యూయార్క్ నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్​ స్టేడియం(Nassau County International Cricket Stadium) లో జరిగిన మ్యాచ్​లో భారత్​, అమెరికా తలపడగా, భారత్​ 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.  బౌలర్లకు స్వర్గధామంగా మారిన ఈ పిచ్​పై  టాస్​ గెలిచి ఆనవాయితీ ప్రకారం, అమెరికాను బ్యాటింగ్​కు దింపిన ఇండియా సరైన ఫలితాలను రాబట్టింది. ఇన్నింగ్స్​ మొదటి బంతికి వికెట్​ను బలి తీసుకున్న అర్షదీప్​ సింగ్(Arshdeep Singh)​, ఇన్నింగ్స్​ ఆసాంతం అదేపని మీద ఉన్నాడు. అయితే అమెరికా కూడా అంత తేలిగ్గా ఏమీ లొంగలేదు. తక్కువ స్కోరు చేసారన్న మాటే గానీ, భారత బౌలింగ్​ను పద్ధతిగానే ఎదుర్కోగలిగారు. ఒక్క అర్షదీప్​ బౌలింగ్​లోనే కష్టపడాల్సివచ్చిందిగానీ, మిగతా బౌలర్ల బంతులను  స్వేచ్ఛగా ఆడారు. భారత స్టార్​ బౌలర్​ బుమ్రా, సిరాజ్​, అక్షర్​లను ఓ రేంజ్​లో ఆడుకున్నారు. మళ్లీ హార్థిక్​ పాండ్యా బౌలింగ్​ వారికి అర్థం కాకుండాపోయి, రెండు వికెట్లు సమర్పించుకున్నారు.

నితీశ్​ కుమార్​(27), స్టీవెన్​ టేలర్​(24)లే టాప్​ స్కోరర్లు. నిర్ణీత 20 ఓవర్లలో యుఎస్​ఏ 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగలిగింది. పవర్​ప్లేలో అమెరికా స్కోరు 3 వికెట్లకు 18 పరుగులు. ఈ పరిస్థితి చూస్తే 50 పరుగులైనా చేస్తుందా అనే అనుమానాన్ని పటాపంచలు చేస్తూ 100 పరుగులు దాటగలిగింది. బౌలింగ్​లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన సిరాజ్​ ఓ కళ్లుచెదిరే క్యాచ్​(Siraj magical catch)  మాత్రం పట్టి పరువు నిలబెట్టుకున్నాడు.

భారత బౌలర్లలో అర్షదీప్​ సింగ్​ రికార్డ్​ బౌలింగ్​(4–0–9_4)తో 4 వికెట్లు తీసుకోగా, పాండ్యా రెండు, అక్షర్​ ఒక వికెట్​ తీసారు. ఈ మ్యాచ్​ ద్వారా అర్షదీప్​ రవిచంద్రన్​ అశ్విన్​ నెలకొల్పిన రికార్డు బద్దలు కొట్టాడు. టి20 ప్రపంచకప్​లో భారత అత్యుత్తమ బౌలింగ్​ ప్రదర్శనగా ఇది నిలిచింది.

తదుపరి ఛేదనకు దిగిన భారత్​, తొలి ఓవర్​లోనే కోహ్లీ వికెట్​ కోల్పోయింది. ఆనవాయితీని పాటిస్తూ, విరాట్​ గోల్డెన్​ డకౌట్​ అయ్యాడు. జరిగిన, ఆడిన మూడు మ్యాచ్​ల్లో ఓపెనర్​గా వచ్చిన కోహ్లీ వరుసగా 1, 4, 0 పరుగులు మాత్రమే చేసాడు. తనెదుర్కున్న తొలి బంతినే కీపర్​కు క్యాచ్​ ఇచ్చి వెనక్కి తిరిగాడు. ​ జట్టు స్కోరు 15 పరుగులున్నప్పుడు కెప్టెన్​ రోహిత్​ కూడా అవుటయ్యాడు. తర్వాత పంత్​, సూర్యకుమార్​లు జాగ్రత్తగా ఆడినా, 44 పరుగుల వద్ద పంత్​ పెవిలియన్​ చేరాడు. సూర్యతో జతకలిసిన దూబే నిలదొక్కుకోవడానికి చాలా టైమ్​ తీసుకున్నా, తరువాత జాగ్రత్తగా ఆడాడు. వీరిద్దరూ మరో వికెట్​ నష్టపోకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. 4 వికెట్​కు 67 పరుగులు జత చేసిన ఈ జంటలో సూర్యకుమార్​ అర్ధసెంచరీ(50 పరుగులతో నాటౌట్​: 2 ఫోర్లు, 2 సిక్స్​లు)తో రాణించగా, దూబే (35 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్​: 1 ఫోర్​, 1 సిక్స్​) పరుగులతో మెరిసాడు. అమెరికా బౌలర్లలో సౌరభ్​ నేత్రావల్కర్​ 2 వికెట్లు తీసుకోగా, ఒక వికెట్​ అలీ ఖాన్​​ తీసాడు.