T20 World Cup 2026 Semifinal Scenario: What India’s Loss to South Africa Means
76 పరుగుల పరాజయం | –3.8 నెట్ రన్రేట్ | ఇక రెండు మ్యాచ్లు ‘డూ ఆర్ డై’
విధాత క్రీడా విభాగం | 22 ఫిబ్రవరి 2026 | హైదరాబాద్:
ICC Men’s T20 World Cup సూపర్–8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ ఓటమి భారత్ సెమీఫైనల్ అవకాశాలకు గట్టిగా దెబ్బతీసింది. అహ్మదాబాద్లోని Narendra Modi Stadiumలో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 63, డివాల్డ్ బ్రెవిస్ 45 పరుగులతో రాణించగా, భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా 3/15తో రికార్డు సృష్టించాడు.
188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ 111 పరుగులకే కుప్పకూలింది. మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.
ఈ ఫలితంతో భారత్కు సెమీఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్లు కీలకంగా మారాయి. ఇప్పుడు భారత్ సెమీస్ చేరుకోవడానికి ఉన్న మార్గాలు పరిశీలిద్దాం.
ALSO READ: టి20 ప్రపంచ కప్ సూపర్ 8 : దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం
సెమీఫైనల్ సమీకరణాలు ఇలా ఉన్నాయి..
పరిస్థితి 1: భారత్ మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే.?
భారత్ మిగిలిన రెండు మ్యాచ్లను (వెస్టిండీస్, జింబాబ్వే పై) గెలిస్తే 4 పాయింట్లు సాధిస్తుంది. సాధారణంగా ఇది సెమీఫైనల్కు సరిపోతుంది.
అయితే మరో రెండు జట్లు కూడా 4 పాయింట్లు సాధిస్తే అప్పుడు నెట్ రన్రేట్ (NRR) కీలకం అవుతుంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి, వెస్టిండీస్–జింబాబ్వేల మ్యాచ్ విజేత కూడా దక్షిణాఫ్రికాను ఓడిస్తే సమీకరణాలు క్లిష్టమవుతాయి.
పరిస్థితి 2: భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే..?
భారత్ ఒకే మ్యాచ్ గెలిస్తే పరిస్థితి మరింత సంక్లిష్టం.
ఈ పరిస్థితిలో దక్షిణాఫ్రికా తమ మిగిలిన రెండు మ్యాచ్లను గెలవాలి. అలాగే భారత్ వెస్టిండీస్–జింబాబ్వే మ్యాచ్ విజేతపై విజయం సాధించాలి. అప్పుడు భారత్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లకు తలా రెండేసి పాయింట్లు ఉంటాయి.
ఇక్కడ కూడా అర్హత పూర్తిగా నెట్ రన్రేట్పైనే ఆధారపడి ఉంటుంది.
మిగిలిన మ్యాచ్లు
- ఫిబ్రవరి 23: వెస్టిండీస్ vs జింబాబ్వే (ముంబై)
- ఫిబ్రవరి 26: దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ (అహ్మదాబాద్)
- ఫిబ్రవరి 26: భారత్ vs జింబాబ్వే (చెన్నై)
- మార్చి 1: దక్షిణాఫ్రికా vs జింబాబ్వే (ఢిల్లీ)
- మార్చి 1: భారత్ vs వెస్టిండీస్ (కోల్కతా)
భారత్కు మార్గం ఇంకా పూర్తిగా మూసుకుపోలేదు. కానీ పరిస్థితి కఠినమైంది. ఇకపై ప్రతి మ్యాచ్ భారీ తేడాతో గెలవాల్సిందే. ముఖ్యంగా నెట్ రన్రేట్ మెరుగుపరచుకోవడం అత్యవసరం.
