Malla Reddy | మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్‌.. ప్రహారి కూల్చివేత

సుచిత్ర భూ వివాదంలో పోరాడుతున్న బీఆరెస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్ పేట్ మండలంలోని బొమ్మరాసిపేట్‌ పెద్ద చెరువు ఎఫ్టీఎల్‌ లో నిర్మించిన ప్రహరీ గోడ ను అధికారులు కూల్చివేశారు.

Malla Reddy | మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్‌.. ప్రహారి కూల్చివేత

విధాత : సుచిత్ర భూ వివాదంలో పోరాడుతున్న బీఆరెస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్ పేట్ మండలంలోని బొమ్మరాసిపేట్‌ పెద్ద చెరువు ఎఫ్టీఎల్‌ లో నిర్మించిన ప్రహరీ గోడ ను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అలాగే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూల్చివేశారు.

కాగా నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వేనంబరు 82, 83లలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం సైతం కొనసాగుతుంది. రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం సర్వే నెం.82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడుకు.. మరో 15మంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం అలా ఉండగానే బొమ్మరాసిపేట్‌ చెరువు ఆక్రమణ వివాదం తలెత్తడం మల్లారెడ్డికి ఇబ్బందికరంగా మారింది.