ఎక్స్‌లో కాంగ్రెస్‌, బీఆరెస్‌ వార్

చేనేత కార్మికుల సమస్యలపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు చేయగా, కాంగ్రెస్ నేత అనిల్ తిప్పికొట్టారు

  • Publish Date - April 7, 2024 / 08:39 AM IST

బడే భాయ్, చోటే భాయ్‌ దెబ్బకు చేనేత బలి

నేతన్నలను ఆగం చేశారన్న కేటీఆర్‌

బీఆరెస్‌ పాలన పాపాలే ప్రాణాలు తీస్తున్నాయి

సీఎం పదవి పోయిందన్న బాధలో కేటీఆర్‌

బీరెస్‌ నేతకు కాంగ్రెస్ నేత అనిల్‌ కౌంటర్‌

విధాత, హైదరాబాద్ : చేనేత కార్మికుల సమస్యలపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు చేయగా, కాంగ్రెస్ నేత అనిల్ తిప్పికొట్టారు. ‘కపట కాంగ్రెస్ పాలనలో కడుపునింపే అన్నదాత ఆగమైండు.. చేనేత కార్మికుడు చితికిపోతుండు. ప్రభుత్వ వైఫల్యం వల్ల, పాలకుడి నిర్వాకం వల్ల ప్రతి నేతన్న నడిరోడ్డు మీద పడ్డడు’ అని కేటీఆర్‌ విమర్శించారు. నాడు తెలంగాణ అవకాశాల గని, చేనేత కార్మికుడికి చేతినిండా పని.. కానీ నేడు చేతకాని కాంగ్రెస్ పాలన.. కార్మికుల పాలిట శని అని విమర్శించారు. బతుకమ్మ చీరల ఆర్డర్లకు అడ్రస్ లేదని, ప్రభుత్వ పెండింగ్ బిల్లులకు మోక్షం లేదని, అసమర్థ పాలనలో దిక్కుతోచని నేతన్నకు..చేసేందుకు పనిలేదు.. తినేందుకు తిండి లేదన్నారు. బీఆరెస్‌ తెచ్చిన సబ్సిడీ పథకాన్ని రాగానే సమాధి చేశారని, చేనేత మిత్ర పథకానికి నిలువునా పాతరేశారని, ఇలా ఇంకెంతకాలం అన్యాయాల జాతర చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీలోని బడే-భాయ్ జీఎస్టీ దెబ్బకు చేనేత రంగం కుదేలైందని, గల్లీలోని ఛోటే-భాయ్ నిర్లక్ష్యానికి నిలువునా బలైందని, అందుకే మూలనపడ్డ మగ్గం సాక్షిగా హెచ్చరిక చేస్తున్నానని, చేనేత కార్మికులను చిన్నచూపు చూస్తున్న భస్మాసుర హస్తానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదన్నారు.

Latest News