చెడ్డీల మీద ఊరికిస్తాం.. గుడ్డి వాళ్ళమనుకుంటున్నారా... పార్కును కబ్జా చేసిన బీఆరెస్ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతుండ్రు ...నర్సంపేటలో ఏం పీకలేనోడు... ఇక్కడికి వచ్చి ఏదో పీకుతాడంట అంటూ బీఆరెఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డిలపై కాంగ్రెస్ నాయకుడు, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం మండిపడ్డారు
మధ్యలో గులాబీ జిల్లా ఆఫీస్
నాయకుల పరస్పరం విమర్శలు
విధాత ప్రత్యేక ప్రతినిధి: చెడ్డీల మీద ఊరికిస్తాం.. గుడ్డి వాళ్ళమనుకుంటున్నారా… పార్కును కబ్జా చేసిన బీఆరెస్ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతుండ్రు …నర్సంపేటలో ఏం పీకలేనోడు… ఇక్కడికి వచ్చి ఏదో పీకుతాడంట అంటూ బీఆరెఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డిలపై కాంగ్రెస్ నాయకుడు, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం మండిపడ్డారు.
బీఆరెఎస్ హనుమకొండ ఆఫీస్ ఒక్క ఇటుక తీసి చూడు… గాంధీభవన్ కూలుతుందంటూ మొన్న ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని కాంగ్రెస్ పార్టీ పక్కదోవ పట్టించేందుకు పార్టీ కార్యాలయం కబ్జా అంటూ ఇతర అంశాలను లేవనెత్తుతున్నారని విమర్శించారు.
బీఆరెఎస్ వర్సెస్ కాంగ్రెస్
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన హన్మకొండ జిల్లా కార్యాలయం ఇప్పుడు వరంగల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే తీవ్ర విభేదాలు నెలకొన్న బీఆరెఎస్, కాంగ్రెస్ మధ్య ఈ ఆఫీస్ వ్యవహారం నిప్పు రాజేష్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, సవాళ్లు చేసుకుంటూ రాజకీయ వేడిని పుట్టి స్తున్నారు.
మొన్న బీఆరెఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశారు. ఆఫీసు ఒక్క ఇటుక తీసి చూడు గాంధీభవన్ కూలుతుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. మునిసిపల్ అధికారులు బీఆరెఎస్ జిల్లా కార్యాలయ నిర్మాణం పై అడిగిన వివరాలను అందజేశామని చెప్పారు. హనుమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రైవేట్ ఆఫీసుల నిర్వహణకు కిరాయికి ఇచ్చారని విమర్శించారు. బీఆరెఎస్ నాయకుల సవాళ్లు, విమర్శలకు గురువారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. బీఆరెఎస్ నాయకుల పై ఫైర్ అయ్యారు.
ఎమ్మెల్యే నాయిని ప్రతిస్పందన
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శలకు స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ శుక్రవారం కాంగ్రెస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆరెఎస్ నాయకులకు మతిభ్రమించిందని, వారు చేసిన అక్రమాలను నెగ్గించుకునేందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ భవనాన్ని టచ్ చేస్తే గాంధీ భవన్ కూలుస్తామంటున్నారని, మొగోళ్లయితే గాంధీభవన్ ను టచ్ చేయాలని సవాల్ విసిరారు. ల్యాండ్ కబ్జాలు చేసినోళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేసి చెడ్డీలు మీద ఉరికిస్తమని హెచ్చరించారు. దాస్యం వినయ్ భాస్కర్ చేసిన అక్రమాలు రెండు రోజులకోటి బయటపెడుతానని పేర్కొన్నారు.
హన్మకొండ జిల్లాను నాశనం చేశారని ఫైర్ అయ్యారు. ఇక నర్సంపేటలో పీకలేని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడి వచ్చి పీకుతాడా అంటూ ఘాటుగా విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా వాళ్లకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. తాను వాళ్లలా మాటలు గాలి మాటలు మాట్లాడడం లేదని, అన్ని అధారాలు ఉన్నాయని, వాళ్లకు ఆ స్థలాన్ని కేటాయించలేదని, ప్రెస్ క్లబ్ వెనకాల ఉన్న జాగా ఇస్తే వారు మార్పు కోసం లెటర్ పెట్టారు కానీ.. కేటాయించలేదన్నారు. ఇక కరెంటు మీటరు లేదని, ఇంటి నెంబర్ కూడా లేదని ఇవి నిజాలు కావో లేదో వాళ్లే చెప్పాలన్నారు. వాళ్లదగ్గర ప్రూఫ్ లు ఉంటే తీసుకురావాలని సవాల్ విసిరారు.