హాట్ టాపిక్…గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ కావడం ఆసక్తి రేపింది. గవర్నర్ తో సీఎం భేటీ ఎందుకు, ఏమిటన్న అంశం పోలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Apr 19, 2026, 12:40 pm IST
Read Time: 3 mins
హాట్ టాపిక్…గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!

విధాత, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ కావడం ఆసక్తి రేపింది. గవర్నర్ తో సీఎం భేటీ ఎందుకు, ఏమిటన్న అంశం పోలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. గవర్నర్ ను మంత్రివర్గ విస్తరణ, లేక పునర్ వ్యవస్థీకరణ కోసం కలిశారా? అన్న అంశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

అయితే గవర్నర్ కోటాలో పెండింగ్ ఉన్న ఎమ్మెల్సీ ఫైల్‌పై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తో భేటీ అయినట్లుగా సమాచారం. అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 30వ తేదీతో ఆరు నెలలు పూర్తి కానుంది. మంత్రి అయినా తరువాత 6 నెలల లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక తప్పనిసరి. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న గవర్నర్ కోటాలోని అజారుద్ధీన్, కోదండరామ్ ఎమ్మెల్సీ పదవుల ఆమోదం గురించి గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా సమాచారం. పెండింగ్‌లో ఉన్న ఇద్దరు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు ప్రొ.కోదండరామ్‌, అజారుద్దీన్‌ పేర్లు ఆమోదించాలని ఈ సందర్బంగా గవర్నర్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కలిసేందుకు ముందు రోజునే సీఎస్ కె. రామకృష్ణరావు, ఏజీ సుదర్శన్ రెడ్డి లోక్ భవన్ కు వెళ్లడం గమనార్హం.మంత్రి అజారుద్దీన్ కు సంబంధించిన ఎమ్మెల్సీ ఫైల్ కు ఆమోదం తెలుపాలని వారు గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ అజారుద్దీన్ పదవి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు సార్లు గవర్నర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ నెలాఖరులోగా గవర్నర్ సంతకం కాకపోతే మినిస్టర్ పోస్ట్ కు అజారుద్దీన్ రిజైన్ చేసే అవకాశం ఉంది.