CM Revanth Reddy | టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫెజ్ 3లో చేర్చాలి: సీఎం రేవంత్రెడ్డి
టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3 పథకంలో చేర్చాలని సీఎం రేవంత్రెడ్డి కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రి సింథియాకు సీఎం రేవంత్రెడ్డి వినతి
విధాత, హైదరాబాద్ : టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3 పథకంలో చేర్చాలని సీఎం రేవంత్రెడ్డి కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సింథియాతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు అయ్యారు. అనంతం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాలకు నెట్ వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమన్నారు. 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. “పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని, నెలకు రూ.300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టీ-ఫైబర్ అమలుకు ఎన్ఎఫ్ఓఎన్ సహకారం అవసరమని, ఇందుకు భారత్ నెట్ పథకాన్ని టీ-ఫైబర్కు వర్తింపజేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లుగా తెలిపారు. టీ-ఫైబర్కు రూ.1,779 కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరినట్లుగా సీఎం చెప్పారు