ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్రెడ్డి పరామర్శించారు. చుక్కా రామయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం
విధాత, హైదరాబాద్ : ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్రెడ్డి పరామర్శించారు. చుక్కా రామయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నల్లకుంటలోని చుక్కా రామయ్య నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి ఆయనను పరామర్శించి, ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని చుక్కా రామయ్యను రేవంత్రెడ్డి ఆహ్వానించారు.