విధాత: సూర్యాపేట DMHO కోటాచలం కుటుంబంలో ఆరుగురికి కొవిడ్ సోకింది.5 రోజుల క్రితమే జర్మనీ నుంచి DMHO కొడుకు కోడలు వచ్చారు దీంతో కుటుంబ సబ్యులతో కలిసి మూడు రోజుల క్రితం తిరుపతి వెళ్లివచ్చారు.కుటుంబ సబ్యులు కొంత అస్వస్థతకు గురవ్వగా కోవిడ్ టెస్ట్ చేయించడంతో DMHO భార్య, కుమారుడు, కోడలుకు పాజిటివ్ గా వైద్యులు నిర్దారించారు.
వీరికి పాజిటివ్ రావడంతో గురువారం నాడుDMHO కూడా టెస్ట్ చేయించుకోగా కొవిడ్ నిర్ధారణ అయింది.కోటాచలం ఎయిడ్స్ డే కార్య క్రమం లో పాల్గొని.. వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించడంతో మిగతావారు కూడా ఆందోళణ చెందుతున్నారు.