విమానం ఇంజన్లో మంటలు..ప్రయాణికులు క్షేమం
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాలిలోకి ఎగిరాక ఇంజన్లు చెలరేగిన మంటలను పైలట్ సకాలంలో గుర్తించి ల్యాండింగ్ తీసుకోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్లయ్యింది

విధాత : హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాలిలోకి ఎగిరాక ఇంజన్లు చెలరేగిన మంటలను పైలట్ సకాలంలో గుర్తించి ల్యాండింగ్ తీసుకోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్లయ్యింది. గురువారం ఉదయం మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్నది.
విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 15 నిమిషాలకు విమానం కుడివైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. గుర్తించిన పైలట్ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ ల్యాండింగ్కు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. చివరకు విమానం సేఫ్గా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సహా విమానంలో 130 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు