ఫోన్ ట్యాపింగ్ నిందితుడు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అరెస్టు

ఫోన్‌ ట్యాపింగ్ కేసు నిందితుడు టాస్క్‌ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న రాధా కిషన్ రావు ను పిటి వారంట్‌ కింద అదుపులోకి తీసుకున్నారు

  • Publish Date - July 4, 2024 / 03:30 PM IST

సెటిల్మెంట్ కేసులో జైలులోనే అదుపులోకి

విధాత : ఫోన్‌ ట్యాపింగ్ కేసు నిందితుడు టాస్క్‌ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న రాధా కిషన్ రావు ను పిటి వారంట్‌ కింద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినందుకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసులో ఆయనను అరెస్టు చేశారు. కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకునే సెటిల్మెంట్ చేశారని, 150 కోట్ల కంపెనీని తక్కువ ధరకే మరొకరికి బలవంతంగా బెదిరించి ఇప్పించారని రాధాకృష్ణన్ రావు పై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అదే కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Latest News