నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పొలం వద్ద ఉన్న బోరుబావిలో నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. అతడిని రక్షించేందుకు వెళ్లిన తాత వెంకన్న (50) కూడా అందులో చిక్కుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి బోరుబావి నుంచి వారిద్దరినీ బయటకు తీశారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా ఊపిరాడక తాత వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురై మార్గమధ్యంలోనే మృతి చెందాడు. బాలుడికి చికిత్స కొనసాగుతోంది. తాత వెంకన్న మృతితో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో పడిపోయారు.
నల్గొండ జిల్లాలో బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల బాలుడు
బాలుడిని కాపాడేందుకు వెళ్లి అదే బోరు గుంతలో ఇరుక్కుపోయి తాత మృతి
మిర్యాలగూడ మండలం, ఊట్లపల్లి శివారులో వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల బాలుడు
బాలుడిని కాపాడేందుకు వెళ్లి అదే బోరు గుంతలో… pic.twitter.com/kCTyODr2PL
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026
ఇవి కూడా చదవండి :
సంక్షేమ పథకాల అమలుపై ‘సర్’ దెబ్బ
బండి భగీరథ్ కు హైకోర్టు షాక్
