రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు
  • పలు జిల్లాల నుంచి పోటెత్తిన వలసలు


విధాత: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగాయి. బీఆరెస్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో కొడంగల్, భూపాలపల్లి, పాలకుర్తి, పెద్దపల్లి,తుంగతుర్తి, సికింద్రాబాద్‌, జూబ్లిహిల్స్‌ నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఎస్ఎం హసన్, మైనారిటీ నేతలు సయ్యద్ ఖలీల్, మహమ్మద్ అమన్ అలీ , ఎండీ నజీబ్, పలువురు బీఆరెస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.


కొడంగల్ బీఆరెస్‌ ఎమ్మెల్యే అనుచరులు పల్లెగడ్డ వెంకటయ్య, గడ్డం రవి, చందు, నర్సింహులు గౌడ్, మద్దూరు మండలానికి చెందిన పలువురు కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన పీఏసీఎస్‌ చైర్మన్ గండ్ర సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ పొన్నం లక్ష్మీ-రవి, ఘనపురం, చిట్యాల మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నగేష్, రత్నాకర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి తమ మద్దతుదారులతో కాంగ్రెస్‌ళో చేరారు.


పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్ కాకిరాల హరిప్రసాద్, రాయపర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, సర్పంచులు హరినాథ్, సంపత్, పలువురు బీఆరెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఓయూ నేత కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓయూ, కేయూ విద్యార్థి సంఘాల నేతలు, పరిశోధక విద్యార్థులు కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ విద్యార్థి సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పెంచాల సతీష్, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ ఓయూ అధ్యక్షులు మాండ్ల రవి, టీవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ రాజ్, టీవీఎస్‌ కాకతీయ యూనివర్సిటీ నాయకులు కూనూరి రంజిత్, టీఎస్పీ జేఏసీ స్టేట్ చైర్మన్ కె.చంద్రశేఖర్, ఇతర విద్యార్థి సంఘాల నేతలు కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు.


నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దొడ్ల ఈశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ డి.వెంకట్ రెడ్డి, సర్పంచులు ఎస్.లింగారెడ్డి, ఎం.యాదగిరి, మాజీ సర్పంచ్ ఏ.సుబ్బారెడ్డి, ఇతర సీనియర్ నాయకులు, పలువురు కార్యకర్తలు, పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ శ్రీనివాస్, సర్పంచ్ వెంకటేశం, ఉపసర్పంచ్ కుంట రేవతి-లింగమూర్తి, వార్డు సభ్యులు, పలువురు కార్యకర్తలు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. సికింద్రాబాద్‌, జూబ్లిహిల్స్‌, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలను రేవంత్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.