ఆయకట్టుకు నీటి విడుదల చేయాలి..అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం

వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రంగసముద్రాన్ని బుధవారం మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సంద‌ర్శించారు. వీప‌న‌గండ్ల‌, చిన్నంబావి మండ‌లాల‌కు సాగునీరు అందించే భీమా కెనాల్‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని రైతులు మంత్రి జూప‌ల్లికి ఫిర్యాదు చేశారు

విధాత, వనపర్తి ప్రతినిధి: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రంగసముద్రాన్ని బుధవారం మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సంద‌ర్శించారు. వీప‌న‌గండ్ల‌, చిన్నంబావి మండ‌లాల‌కు సాగునీరు అందించే భీమా కెనాల్‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని రైతులు మంత్రి జూప‌ల్లికి ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో మంత్రి జూప‌ల్లి రంగ‌స‌ముద్రం బ్యా లెన్సింగ్ రిజర్వాయ‌ర్ ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిలిశీలించారు. నీటి విడుద‌ల‌కు జాప్యం చేసిన సాగునీటి అధికారుల‌పై మంత్రి తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. రిజ‌ర్వాయ‌ర్ లో నీళ్లు ఉన్న‌ప్పటికి, సాగునీటి అవ‌స‌రాల‌కు అనుగుణంగా నీటిని ఎందుకు విడుద‌ల చేయ‌లేద‌ని నిల‌దీశారు. భ‌విష్య‌త్ లో ఇలాంటివి పునరావృతమైతే బాధ్యుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఆయ‌క‌ట్టు అవ‌స‌రాల‌కు అనుగుణంగా నీటిని విడుద‌ల చేయాల‌ని, రోజువారీగా ఎంత నీటిని విడుద‌ల చేస్తున్నారో దాని లాగ్ బుక్ లో న‌మోదు చేయాల‌న్నారు. మంత్రి వెంట‌ ఎస్ఈ  శ్రీనివాస్ రెడ్డి, ఈఈ కేశవ రావు, డీఈలు కిరణ్ కుమార్, రాజ్ కుమార్, ఏఈఈ వినయ్ కుమార్, ఏఈ అక్షయ్ కుమార్  ఉన్నారు.