హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై విచారణ జరిపింది. సీబీఐ చార్జ్ షీట్లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా న్యాయస్థానానికి చెప్పారు. తప్పులు లేవని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. చార్జ్ షీట్లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి భవేజా చెప్పారు. కోర్టు ఆర్డర్ అప్ లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా అన్నారు. డిఫాల్ట్ బెయిల్, చార్జ్ షీట్లో తప్పులపై విచారణ జరిగేంత వరకు చార్జ్ షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలని న్యాయవాది నితేష్ రానా కోరారు. చార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశానికి, కవిత డిఫాల్ట్ బెయిల్కి సంబంధం లేదని, తాము సరైన పద్దతిలోనే చార్జ్షీట్ దాఖలు చేశామని సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. ఇరువర్గాల వాదన వన్న జడ్జీ కావేరి భవేజా తదుపరి విచారణను జూలై 22 కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్టు చేసింది. అమె తిహార్ జైలులో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె ట్రయల్ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
CBI | కవిత కేసు విచారణ 22కు వాయిదా … చార్జ్షీట్ దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది.

Latest News
ఫ్యాటీ లివర్ సమస్యకు చక్కటి పరిష్కారం ముల్లంగి.. దీని ప్రయోజనాలు తెలిస్తే తినక మానరు..!
అడవి ఏనుగుల ఉన్మాదం – ఇద్దరు రైతుల దారుణ మరణం
మీకు తెలుసా.. రైలు ఆలస్యమైతే ఫ్రీగా ఫుడ్ పొందొచ్చు..!
పుట్టగొడుగుల సాగుతో.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్న ఒడిశా రైతు
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ 33 ఫస్ట్ లుక్ రిలీజ్
అక్కడ కేఏ పాల్ లెవల్ వేరయా..!
2030 నాటికి దేశంలో గిగ్ వర్కర్లు 2 కోట్ల 35 లక్షలు..!
మన శంకర వర ప్రసాద్ గారి కలెక్షన్ల సునామీ : 5వ రోజునాటికి 150 కోట్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంపన్నుల చేతుల్లో ఆయుధం..!
ఎంతకాలం విచారించాలి: ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీం కోర్టు అసహనం