హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై విచారణ జరిపింది. సీబీఐ చార్జ్ షీట్లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా న్యాయస్థానానికి చెప్పారు. తప్పులు లేవని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. చార్జ్ షీట్లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి భవేజా చెప్పారు. కోర్టు ఆర్డర్ అప్ లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా అన్నారు. డిఫాల్ట్ బెయిల్, చార్జ్ షీట్లో తప్పులపై విచారణ జరిగేంత వరకు చార్జ్ షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలని న్యాయవాది నితేష్ రానా కోరారు. చార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశానికి, కవిత డిఫాల్ట్ బెయిల్కి సంబంధం లేదని, తాము సరైన పద్దతిలోనే చార్జ్షీట్ దాఖలు చేశామని సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. ఇరువర్గాల వాదన వన్న జడ్జీ కావేరి భవేజా తదుపరి విచారణను జూలై 22 కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్టు చేసింది. అమె తిహార్ జైలులో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె ట్రయల్ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
CBI | కవిత కేసు విచారణ 22కు వాయిదా … చార్జ్షీట్ దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది.

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి