హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై విచారణ జరిపింది. సీబీఐ చార్జ్ షీట్లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా న్యాయస్థానానికి చెప్పారు. తప్పులు లేవని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. చార్జ్ షీట్లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి భవేజా చెప్పారు. కోర్టు ఆర్డర్ అప్ లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా అన్నారు. డిఫాల్ట్ బెయిల్, చార్జ్ షీట్లో తప్పులపై విచారణ జరిగేంత వరకు చార్జ్ షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలని న్యాయవాది నితేష్ రానా కోరారు. చార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశానికి, కవిత డిఫాల్ట్ బెయిల్కి సంబంధం లేదని, తాము సరైన పద్దతిలోనే చార్జ్షీట్ దాఖలు చేశామని సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. ఇరువర్గాల వాదన వన్న జడ్జీ కావేరి భవేజా తదుపరి విచారణను జూలై 22 కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్టు చేసింది. అమె తిహార్ జైలులో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె ట్రయల్ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
CBI | కవిత కేసు విచారణ 22కు వాయిదా … చార్జ్షీట్ దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది.

Latest News
స్వగ్రామానికి విరోష్ జంట…
ఒడిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు వికాస్ సహా 15 మంది మావోయిస్టుల లొంగుబాటు
జ్యోతిష్యంతో చావు భయం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య !
నాగ్ పూర్ లో పేలుడు.. 15మంది దుర్మరణం
ఇరాన్ పాలన సుప్రీం లీడర్ నుంచి కౌన్సిల్ చేతిలోకి..!
సీనియర్ నేత కుట్రతో చేజారిన పీసీసీ పీఠం?.. ఒంటరైన జీవన్ రెడ్డి.. పొమ్మన లేక పొగ
విరోష్ పెళ్లి కానుకగా దేశవ్యాప్తంగా స్వీట్లు, గుళ్లలో అన్నదానం ..
రూ.10కోట్ల పంచలోహ విగ్రహం..ప్రతిష్టాపనోత్సవానికి సిద్దం
గుండెల్ని పిండేసే దృశ్యం..ఇజ్రాయెల్ దాడిలో 108మంది విద్యార్థినుల మృతి
దేవ్ జీ నేతృత్వంలో తెలంగాణ నేల మీదుగా లొంగిపోయిన మావోయిస్టు నేతలతో రాజకీయపార్టీ