ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నాంపల్లి కోర్టుకు కేటీఆర్‌

ఫార్ములా ఈ కార్ రేసు ఏసీబీ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో కేటీఆర్ ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 31, 2026, 12:37 pm IST
Read Time: 2 mins
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నాంపల్లి కోర్టుకు కేటీఆర్‌

ఫార్ములా ఈ కార్ రేసు ఏసీబీ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో కేటీఆర్ ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా ఉన్న మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిలు సమన్లతో తొలిసారి విచారణకు హాజరై వాటిని కోర్టుకు సమర్పించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది.

బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో హెచ్​ఎండీఏ నిధుల నుంచి దాదాపు రూ.55 కోట్లను ఆర్బీఐ, కేబినెట్ ఆమోదం లేకుండా విదేశీ సంస్థకు బదిలీ చేశారనే కేసులో ఏసీబీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌లో కేటీఆర్​ ను ఏ-1గా, ఐఏఎస్ అధికారి అర్వింద్‌ కుమార్‌ను ఏ-2గా, మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్​ఎన్​ రెడ్డిని ఏ-3గా చేర్చింది. ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, నిందితులకు సమన్లు జారీ చేయడంతో కేటీఆర్​ నేడు విచారణకు హాజరయ్యారు.