కులవర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త సామాజిక తెలంగాణ స్వాప్నికుడు.. నేడు మారోజు వీరన్న 25 వర్ధంతి
నేడు (గురువారం )కుల వర్గ జమిలి పోరాట సిద్ధాంత కర్త, అస్థిత్వ పోరాట ప్రతీక కుల సంఘాల ఆధ్యుడు , మహాజన ఫ్రంట్, తెలంగాణ మహాసభ నిర్మాత మారోజు వీరన్న 25వ వర్ధంతి. దేశంలో సమకాలీన రాజకీయాల్లో తరచూ చర్చనీయాంశంగా మారిన వ్యక్తి వీరన్న. విప్లవ, ప్రగతిశీల శిబిరంలో ఆయన చూపిన మార్గం ఇప్పటికీ చిరస్మరణీయంగా ఉంది. చిన్న వయస్సుల్లోనే పాలకుల రాజ్యహింసకు బలైనప్పటికీ ఇప్పటికీ ఆయన అందించిన మార్గం దళిత,బహుజన వర్గాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ దేశంలో ఆర్ధిక, సామాజిక అసమానతలు తొలగించే విప్లవానికి దిక్చూచిగా ఆయన మార్గం మారింది.
గురువారం నాటికి ఆయన ఎన్ కౌంటర్ జరిగిన 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. వీరన్న 25వ వర్ధంతిని నిర్వహించేందుకు ఆయన అభిమానులు, వివిధ సంఘాలు, పార్టీలు, తమ శక్తి మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరన్న అందించిన ఆశయాలు ప్రచారంలోకి తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
ఇండియాలో ఏం చేయాలి
మారోజు వీరన్న ఈ దేశంలో వివిధ అస్తిత్వల్లాగానే కులం కూడా ఒక అస్తిత్వమని, ఆ కుల వ్వస్థను నిర్మూలించేందుకు అ కులాన్ని సాధనం చేసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు. దీని కోసం ప్రత్యామ్నాయ దృక్పథంతో ప్రత్యేక కులపోరటాన్ని నిర్మించాలన్నారు. ఈ ప్రత్యామ్నాయ కులవర్గ జమిలి పోరాటాలకు దళిత బహుజన కార్మిక వర్గ దృక్పథంతో నాయకత్వం వహించాలన్నారు. ‘ఇండియాలో ఎం చేయాలి’ అన్న పుస్తకం రాసి ఇండియాలో ఉద్యమాలకు నూతన పంథాను నేర్పించిన ప్రజామేధావి మారోజు వీరన్న. భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా ఆయన అందించిన మార్గం, స్ఫూర్తి ఇప్పటికీ మన మధ్యే నిలిచే ఉంది.
సామాజిక తెలంగాణ స్వాప్నికుడు
భౌగోళిక తెలంగాణ కాదు ప్రజాస్వామిక తెలంగాణ కావాలని దళితబహుజనులను బలమైన సామాజిక, రాజకీయ, నిర్ణయాత్మక రాజ్యాధికార శక్తిగా మార్చడానికి తన శక్తినంతా వీరన్న ధారబోశారు. తెలంగాణ మహాసభ ద్వారా దళితులను,బీసీలను, ఆదివాసీలను, మహిళలను, మైనార్టీలను ఐక్య పోరాటాల్లోకి తీసుకరావాలని సిద్ధాంతీకరించి హక్కుల సంఘాలను ఏర్పాటు చేసి మరీ సంఘ సేవకు ఊపిరిపోశారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, దళిత ఉద్యమం, రిజర్వేషన్ పోరాటఉద్యమాలలో, మండల్ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. రిజర్వేషన్లను వ్యతిరేకించిన మండల్ శక్తులకు వ్యతిరేకంగా అణగారిన కులాలను సమీకరించేందుకు విద్యార్ధి ఉద్యమ నేతగా తన వంతు కృషి చేశారు. సూర్యాపేట పట్టణంలో వేలాది మందితో తెలంగాణ రాష్ర్ట సదస్సు నిర్వహించి, ప్రత్యేక రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమానికి విత్తానాలు చల్లారు. తెలంగాణ మహాసభను స్థాపించారు.
మహాజన ఫ్రంటు ఏర్పాటు
అణగారిన కులాలు, జాతలు, తెగలను ఐక్యం చెయ్యడానికి, ఐక్య రాజకీయ ఉద్యమాల నిర్వహణ కోసం వీరన్న నాయకత్వంలో మహాజన ఫ్రంటు రూపొందించారు. విద్యార్దులను బహుజన రాజ్య నిర్మాణానికి కార్యొన్ముఖులను చేయడానికి బహుజన ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య స్థాపించారు. రిజర్వేషన్ ఉద్యమాన్ని, అస్థిత్వ ఉద్యమంగా వీరన్న భావించారు. దీంతో అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీలను విడివిడిగా సంఘటితం చేయడానికి మారోజు వీరన్న అనేక అణగారిన కులాలకు కుల సంఘాలను స్థాపించారు. ఆయన విద్యార్ధిగా ఉన్నపుడే అన్యాయం, ఊరు తిరుగబడింది మొదలగు నాటికలను ప్రదర్శించి ప్రజలమన్నలను పొందారు. వీరన్న మంచి ఉపన్యాసకుడిగానే కాకుండా గాయకుడిగా గుర్తింపు పొందారు. విద్యార్ధి దశ నుంచి ఎదిగి కులవర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్తగా పేరొందారు. విప్లవ శిబిరంలో ఈ చర్చను లేవనెత్తి సంచలనంగా మారారు. వీరన్న అమరుడై 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆయనకు నివాళులు అర్పించేందుకు దళిత, బహుజనులు ముందుకు సాగాలని పిలుపునిస్తున్నాం. ద్రావిడ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పూసాల శ్రీకాంతాచారి ఆధ్వర్యంలో మే 16 గురువారం హనుమకొండలోని వివేకానంద స్కూల్, సుప్రభ హోటల్ ఎదురుగా వర్ధంతి నిర్వహించనున్నారు. వీరన్న అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
పూసాల శ్రీకాంతాచారి
ద్రావిడ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు
హైకోర్టు న్యాయవాది, 7207728593