విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇక బీఆరెస్ పని అయిపోయిందని, ఆ పార్టీ కథ ముగిసిన అధ్యాయనమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో శనివారం మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రగతి భవన్, ఫామ్ హౌస్కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యరంగం గురించి కేసీఆర్ తన పాలనలో ఏ రోజూ పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టులను కమిషన్ల సాధనాలుగా మార్చకున్నాడని విమర్శించారు.
ళేశ్వరం, మిషన్ భగీరథలో కోట్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూశారన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ను విమర్శించే అర్హత హరీష్ రావుకు ఏమాత్రం లేదని, రైతులపై బీఆరెస్ కపట ప్రేమ చూపుతుందన్నరు. ఆగష్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. బీఆరెస్ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతోందని చెప్పారు. తెలంగాణలో పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని విమర్శించారు.