ఒకప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి-ఇవ్వాళ కన్నాలు వేస్తున్నట్లు బయట ప్రచారం
విధాత: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరి అడ్డగాడిదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్రెడ్డి దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిదని, మార్కెట్ చేసుకొనేందుకు హడావిడి తప్ప అంత సీన్ లేదని కేటీఆర్ ఎద్దేవాచేశారు.వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్కుమార్ జాతీయ పార్టీలకు తొత్తులని దుయ్యబట్టారు. షర్మిల, సీఎం కేసీఆర్పై తప్ప బీజేపీ, కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.సీఎంను నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసులు […]

విధాత: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరి అడ్డగాడిదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్రెడ్డి దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిదని, మార్కెట్ చేసుకొనేందుకు హడావిడి తప్ప అంత సీన్ లేదని కేటీఆర్ ఎద్దేవాచేశారు.వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్కుమార్ జాతీయ పార్టీలకు తొత్తులని దుయ్యబట్టారు. షర్మిల, సీఎం కేసీఆర్పై తప్ప బీజేపీ, కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.సీఎంను నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసులు పెట్టడానికి వెనకాడమని హెచ్చరించారు.
టీఆర్ఎస్ ఓట్లు చీల్చి జాతీయ పార్టీలకు న్యాయం చేయాలని చూస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో దమ్ముంటే బీసీబంధు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు నిజమైన ముక్తి రాష్ట్రం ఏర్పడటంతోనే జరిగిందని తెలిపారు.బీజేపీకి సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదని, ఆనాడు సాయుధ పోరాటం చేసింది కమ్యునిస్టులేనని కేటీఆర్ గుర్తుచేశారు.
తెలంగాణకు 2వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి…మేము ప్రభుత్వంలో ఉన్నాము- సంక్షేమంలో మేము నిమగ్నమయ్యాము.మేము-మా ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నాము.కేసీఆర్ అభివృద్ధి పథకాలు చూసుకుంటూ పాదయాత్రలు చేస్తున్నారు.నిన్నగాక మొన్న వచ్చిన ఒకాయన మార్కెట్ లో నేనున్నానని చూపుకుంటున్నారు.హుజురాబాద్ లో టీఆరెస్ కచ్చితంగా గెలుస్తుంది,జానారెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి-చిన్న పిలగాడు ఓడించాడు…ప్రజలకు టీఆర్ఎస్ పై నమ్మకం ఉంది.
గజ్వేల్ లో కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు హుజురాబాద్ లో కాంగ్రెస్ కి డిపాజిట్లు వస్తాయా…? 50కోట్లు పెట్టి ఠాకూర్ పీసీసీ అమ్మాడని అప్పట్లో వాళ్లే విమర్శలు చేసుకున్నారు.వంటేరు ప్రతాప్ రెడ్డి అప్పట్లో ఇంతకంటే గొప్పగా సభలు పెట్టారు.ప్రజలు చాలా చైతన్యవంతులు ఎవరికి ఓట్లు వెయ్యలో వాళ్లకు తెలుసు.తెలంగాణలో ఎంఐఎంకి ఎవ్వరూ భయపడటం లేదు- బీజేపీ భయపడుతోంది.
బీజేపీ ఆదిలాబాద్ కి ట్రైబెల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు ఇచ్చారా…?సాయుధ పోరాటం చేసిన నేతలకు పెన్షన్స్ ఇవ్వమంటే కేంద్రం ఇవ్వడం లేదు.అమిత్ షా రాష్ట్రానికి వచ్చి తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు ఒక్క దాని గురించి అయినా చెప్పారా…?ఎంపిలుగా గెలిచి బీజేపీ నేతలు రాష్ట్రానికి ఎమ్ చేశారు.ఢిల్లీ పార్టీలు సిల్లి పాలిటిక్స్ చేస్తున్నాయి కొత్తగా పుట్టుకొచ్చిన కొన్ని పార్టీలు ఎందుకు పుట్టాయో ప్రజలకు తెలుసు.కొత్త పార్టీలు కేసీఆర్ ను మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తున్నాయి.ఢిల్లీ పార్టీలపై ఎందుకు మాట్లాడరు.
కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ, విద్యాలయాలు ఇవ్వకపోతే ప్రవీణ్ కుమార్ ఎందుకు మాట్లాడటం లేదు.కాంగ్రెస్- బీజేపీపై షర్మిల- ప్రవీణ్ కుమార్ ఎందుకు మాట్లాడటం లేదు…?టీఆర్ఎస్ ఓటును చీల్చడానికి ఉద్భవించిన పార్టీలు షర్మిల-ప్రవీణ్ కుమార్ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజలకు లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ.సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటేనే- దేశంలో ఎక్కడా లేని ప్రథకాలు అమలు అవుతున్నాయా…?కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే తెలంగాణ కుపెట్టుబడులు- తెలంగాణ అభివృద్ధి ఆగుతుందా.
ప్రతిపక్షాలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.ఎవ్వరిని వదిలిపెట్టం- గుడ్డలు ఊడదీస్తాం- పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్ లో నాలుగు ఇండ్లు ఎట్లా వచ్చాయి.అందరికి భాగోతం మా దగ్గర ఉంది- అన్ని బయట పెడుతాం.కాంగ్రేస్ కి దమ్ము ఉంటే హుజురాబాద్ లో డిపాజిట్లు వస్తాయా పీసీసీ కొనుకున్నోడు-రేపు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోడా.రాష్ట్రం గురించి ఒక ఎంపీ మాట్లాడితే అతన్ని గాడిద అంటావా,దళితబంధు అనేది 1990లోనే సిద్దిపేట లో ఉన్నది.కాంగ్రేస్ 60 ఏళ్ల రాజకీయ పాలనలో దళితులకు దళితబంధు పథకం లాంటిది ఎప్పుడైనా పెట్టారా.
బీసీ బంధు కావాలంటున్న బండి సంజయ్ దేశంలో ఉన్న ప్రతి బీసీలకు- బలహీన వర్గాలకు లక్షలు లక్షలు పంచాలని మోడీకి చెప్పండి.మతం పేరుతో చిల్లర డ్రామాలు మాకు రావు.నాకు డ్రగ్స్ కు ఎమ్ సంబంధం…?నా రక్తం-వెంట్రుకలు ఇస్తా ఏ పరిక్షకైనా సిద్ధం-మరి రాహుల్ గాంధీ ఇస్తాడా.ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం- ఈడీకి లెటర్ ఇచ్చిన వాడు బఫున్.ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెడుతాం-అవసరం అయితే రాజద్రోహం కేసులు కూడా పెడుతాం.
అడ్రెస్ లేని వ్యక్తులు కేసీఆర్ ని తిడితే ఊరుకోము,ఉద్యమంలో కేసీఆర్ తిడితే ఆనాడు ఉద్వేగం ఉంది. ఇవ్వాళ వీళ్లకు ఎమ్ రోగం.సింగరేణి బాలిక ఘటనపై చట్టం తనపని తాను చేసుకుంది.దిశ ఘటనపై దేశం హర్షించింది.నాకు కూతురు ఉంది కన్నీళ్లు పెట్టుకున్నాం.మహారాష్ట్ర ప్రభుత్వంను ఇన్స్పరేషన్ గా తీసుకుంటాం.ఒకప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి-ఇవ్వాళ కన్నాలు వేస్తున్నట్లు బయట ప్రచారం జరుగుతోంది.క్రిమినల్స్ కు ఛార్జిషీట్స్ మాత్రమే తెలుసు,రోజు కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు మాత్రమే చార్జిషీట్లు అంటరు.ఈటెల రాజేందర్ జానారెడ్డి కంటే పెద్దవాడు కాదు కదా,బండి సంజయ్ కు ఓట్లు వేసిన ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు.