విధాత : రిజర్వేషన్ల రద్దు అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి ఘాటుగా స్పందించారు. నోటీస్లకు కాంగ్రెస్ నేతలెవ్వరూ భయపడబోరన్నారు. బీజేపీ దేశంలో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐలతో బెదిరించాలని చూస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల నోటీసులు కక్ష సాధింపు చర్య అన్నారు. ఫేక్ వీడియో అంటూ నోటీసులు పంపారని, అసలు సీఎం రేవంత్రెడ్డికి ఆ వీడియోలతో సంబంధం ఏమిటని ఉత్తమ్ ప్రశ్నించారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 14సీట్లు గెలవబోతుందన్నారు.
నోటీసులకు భయపడేది లేదు: మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి
రిజర్వేషన్ల రద్దు అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి ఘాటుగా స్పందించారు

Latest News
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు