రఘురాంరెడ్డిని గెలిపించి సోనియమ్మకు కానుకిద్దాం

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సోనియమ్మకు కానుకిద్దామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు పేర్కోన్నారు

  • Publish Date - April 27, 2024 / 08:01 PM IST

మంత్రులు పొంగులేటి, తుమ్మల

విధాత : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సోనియమ్మకు కానుకిద్దామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు పేర్కోన్నారు. శనివారం అశ్వారావుపేట కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రఘురాంరెడ్డి కుటుంబం నిస్వార్ధ రాజకీయాలకు ప్రజాసేవకు పెట్టింది పేరన్నారు. రఘురాంరెడ్డి గెలుపుతో ఖమ్మం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం సీటు అత్యంత ప్రతిష్టాత్మకమని కార్యకర్తలంతా గట్టిగా పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను, రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజా సేవకే రఘు రాంరెడ్డి పోటీ చేస్తున్నారన్నారు. రఘు రాంరెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి గతంలో నాలుగు సార్లు ఎంపీ గా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలకు తనవంతుగా సేవ చేసేందుకే రఘురాంరెడ్డి పోటీ చేస్తున్నారని తెలిపారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ ఖమ్మం కంచుకోట అని నిరూపించాలన్నారు.

Latest News